జీర్ణశక్తిని కాపాడే మంచి ఔషధం పనసపొట్టు…
పనసపొట్టును పసుపు, ఇంగువ, ధనియాలపొడి వేసిన నీళ్లలో ఉడికించి నీరు పిండిన తరువాత ముక్కల్ని చిన్నగా తరిగి, మిరియాలపొడి, జీలకర్ర, నెయ్యి వేసి దోరగా వేయిస్తారు.
వేపుడు: పనసపొట్టును పసుపు, ఇంగువ, ధనియాలపొడి వేసిన నీళ్లలో ఉడికించి నీరు పిండిన తరువాత ముక్కల్ని చిన్నగా తరిగి, మిరియాలపొడి, జీలకర్ర, నెయ్యి వేసి దోరగా వేయిస్తారు. చివరగా పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమపువ్వు, నిమ్మముక్కలు, మొగలి రేకులు వంటి పరిమళద్రవ్యాలను స్వల్పంగా కలిపి, తెల్లని వస్త్రంలో మూటగట్టి కాగుతున్న నేతిలో ఉంచుతారు. ఇది నలుడు పాక దర్పణంలో చెప్పిన రాజభోజనంలో ముఖ్యమైన వంటకం. పోషకాల పుట్ట. రక్తపోటు, మధుమేహం, రక్తహీనతలను తగ్గిస్తుంది. వాత వ్యాధులతో బాధపడేవారికి మంచిది.
