హెల్మెట్ రోడ్డు భద్రత గురించి అవగాహన.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
కల్వకుర్తి పోలీస్ వారి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11గం.లకు అంబేద్కర్ చౌరస్తా నుండి హైదరాబాద్ చౌరస్తా తిరిగి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డు భద్రతపై హెల్మెట్ గురించి అవగాహన కల్పించడానికి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగింది. అందరూ బైక్ తోపాటు హెల్మెట్ పెట్టుకొని పాఠశాల విద్యార్థులచే పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డి.ఎస్.పి. మాట్లాడుతూ.. హెల్మెట్ ద్వారా ప్రాణాలను రక్షించుకోవాలని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని ప్రమాదాల నుంచి రక్షించుకోవాలని పోలీస్ వారు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో డి.ఎస్.పి , ఆర్డిఓ , ఎమ్మార్వో , ఎంవీఐ, సిఐ , ఎస్ఐ లు పత్రిక విలేకరులు, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, యువత, వివిధ ఫౌండేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
