రైతుల సమస్యలను పరిష్కరించండి .

రైతుల సమస్యలను పరిష్కరించండి

— చేనేత పద్మ సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు శ్రీకాంత్–

వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

వీణవంక మండల కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో భాగంగా రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారి సమస్యలు పరిష్కరించాలని చేనేత పద్మ సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు శ్రీకాంత్ వీణవంక మండల తహసిల్దార్ అంబటి రజితను కోరారు. గురువారం రోజున తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమ నిబంధనలు పాటిస్తూ రైతుల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు. వారి వెంట సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరు శ్రీనివాస్ ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version