అంజమ్మ గడ్డ, హేమ్లా తండాలలో ఇందిరమ్మ ఇళ్ల ఘన ప్రారంభం.
తండాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం – ఎమ్మెల్యే.
జడ్చర్ల /నేటి ధాత్రి.
పేదల సొంతింటి కల సాకారం ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని రాజాపూర్ మండలంలో అంజమ్మ గడ్డ తండా మరియు హేమ్లా తండా (సింగమ్మ గూడ)లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల గృహావసరాలను తీర్చేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి అర్హుడికి గౌరవప్రదమైన నివాసం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి కలను సాకారం చేసుకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తండాల అభివృద్ధికి అవసరమైన రహదారులు, తాగునీరు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను దశలవారీగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
