ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేయాలి
ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షించాలి
మాజీ ఎమ్మెల్సీ ,తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో మాజీ ఎమ్మెల్సీ ,తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని,ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేయాలని,ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని మాజీ ఎమ్మెల్సీ ,తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.ప్రభుత్వ బడులు నిలబడాలి- చదువుల్లో అంతరాలు పోవాలి అనే నినాదం తో తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ సిరిసిల్ల చేరుకున్నారు.ఈ సందర్బంగా ఆయన తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రభుత్వం తో పాటు ప్రజలపై కూడా ఉందన్నారు.ప్రాథమిక పాఠశాలలో ప్రి ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని,తరగతి గదికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని,
పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పొరస్పందన వేదిక ఉపాధ్యక్షురాలు మంగ,కార్యవర్గ సభ్యులు నాగమణి,టి.ఎస్ యూ.టీ.ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మన మూర్తి, టి.ఎస్.యూ.టీ.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్,జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు,జిల్లా ఉపాధ్యక్షుడు గుండమనేని మహేందర్ రావు,కోశాధికారి అంబటి రమేష్,కార్యదర్శులు పాముల స్వామి,కొత్వాల్ ప్రవీణ్,తిరుపతి జాదవ్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు సి రామరాజు ,జిల్లా అధ్యక్షులు సిలువేరి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.