ఇండియన్ బ్యాంకులో ‘గోల్డ్ భాస్కర్’.. నిట్టనిలువునా ఖాతాదార్లు దగా..

ఇండియన్ బ్యాంకులో ‘గోల్డ్ భాస్కర్’.. నిట్టనిలువునా ఖాతాదార్లు దగా..

 

బ్రతుకుల్ని భయభ్రాంతులకు గురిచేసే ఘటన ఇది. బెంగళూరులో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ జాతీయ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్.. జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంతానికి వేరే బ్యాంకులో తాకట్టు పెట్టాడు.

బెంగళూరు, ఫిబ్రవరి 16: బ్యాంకుల్లో నగదు, నగలు భద్రంగా ఉంటాయని నమ్మే సామాన్యులకు ఈ వార్త మింగుడుపడటం లేదు. బెంగళూరులోని గిరినగర్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఓ బ్యాంక్ అధికారి, కస్టమర్లు లోన్ కోసం పెట్టిన బంగారాన్ని దొంగతనంగా వాడుకొని ఏకంగా రూ. 3.5 కోట్ల మేర మోసానికి పాల్పడ్డాడు. న్యాయవాది స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్..

బెంగళూరు గిరినగర్ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా కిరణ్ కుమార్ (34) అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం కిరణ్ కుమార్ గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్, ఇంకా జూదానికి (Gambling) బానిసయ్యాడు. తన వ్యసనాల కోసం డబ్బు అవసరమవ్వడంతో బ్యాంకు లాకర్లపై తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. కస్టమర్లు గోల్డ్ లోన్ కోసం బ్యాంకులో ఉంచిన బంగారు ఆభరణాలను మెల్లమెల్లగా బయటకు తీసి, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version