ప్రలోభాలకు లొంగి.. పట్టింపు లేమి…
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్లో పరిశ్రమలు థర్మోకోల్, రెగ్జిన్, ఫైబర్ వంటి వ్యర్థాలను కాల్చివేస్తూ, భూగర్భజలాల్లో కలిపేస్తూ తీవ్ర వాయు, జల కాలుష్యానికి పాల్పడుతున్నాయని స్థానికులు వాపోయారు. కాలుష్యం కారణంగా ప్రజలు, మూగజీవాలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని, పరిశ్రమల యాజమాన్యాల ప్రలోభాలకు లొంగి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.