డెక్కన్ హోటల్ ప్రారంభించిన మాజీ చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండల పరిధిలోని కవేలి గ్రామ శివారులో గల నూతన డెక్కన్ హోటల్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఐడిసి కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ తన్విర్ హాజరై రిబ్బన్ కతరించి హోటల్ ను ప్రారంభించారు. మాజీ చైర్మన్ మాట్లాడుతూ తక్కువ ధరకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించుకోవాలని కోరారు హోటల్ యాజమాన్యం మాజీ చైర్మన్ గారికి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కే ప్రసాద్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మహమ్మద్ వాసిమ్, మీర్ ముజఫర్ అలీ, మహమ్మద్ హామీద్ తదితరులు పాల్గొన్నారు
