అగ్నిమాపక సేవల వారోత్సవం ఘన ముగింపు

అగ్నిమాపక సేవల వారోత్సవం ఘన ముగింపు

 

పరకాల,నేటిధాత్రి

ప్రాంతంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించిన అగ్నిమాపక సేవల వారోత్సవం సోమవారం విజయవంతంగా ముగిసింది.అగ్ని ప్రమాదాల నివారణ,అప్రమత్తత, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవం ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు.ముగింపు కార్యక్రమానికి సంతోష్ నర్సింగ్ హోమ్‌కు చెందిన డాక్టర్ డా.సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.అగ్ని ప్రమాదాల సమయంలో తక్షణ స్పందన ఎంతో కీలకమని,ప్రాథమిక చికిత్సపై అవగాహన ఉండటం ద్వారా ప్రాణనష్టం తగ్గించవచ్చని ఆయన తెలిపారు.ప్రజల్లో చైతన్యం పెంచడంలో అగ్నిమాపక శాఖ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు.వారోత్సవంలో భాగంగా ప్రతిరోజూ వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ప్రారంభ దినాన ర్యాలీలు,ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టగా,తరువాతి రోజుల్లో పర్కల్ బస్ స్టాండ్,సాగర వీధి వంటి ప్రాంతాల్లో ప్రజలకు అగ్ని భద్రతపై సూచనలు అందించారు.

సంతోష్ నర్సింగ్ హోమ్ మరియు వినూత్న న్యూరో & జనరల్ హాస్పిటల్‌లలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగా, శ్రీ బాలాజీ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు.జీఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో మాక్ డ్రిల్ ద్వారా అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను ప్రదర్శించారు.ముగింపు రోజున సన్మానాలు నిర్వహించి కార్యక్రమాన్ని ముగించారు.అగ్ని ప్రమాదాల సమయంలో వెంటనే 8712699306 నంబర్ ద్వారా అగ్నిమాపక అత్యవసర సేవలను సంప్రదించాలని అధికారులు సూచించారు.ఈ వారోత్సవం ద్వారా ప్రజల్లో అగ్ని భద్రతపై అవగాహన మరింత పెరిగినట్లు అధికారులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version