చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం ఉదృతమైన పోరాటాలు
జేఏసీ ఆధ్వర్యంలో అంగడి బజార్ చౌరస్తాలో మానవహారం. ర్యాలీ.
జేఏసీ చైర్మన్ వకళాభరణం నరసయ్య పంతులు
చేర్యాల నేటిదాత్రి
చేర్యాల మద్దూరు దుల్పిట్ట కొమురవెల్లి మండలాలను కలుపుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు అయినను గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది కొత్తగా వచ్చిన ప్రభుత్వం వంద రోజుల్లో చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు అయినను కాలయాపన చేస్తున్నారని జేఏసీ చైర్మన్ వకలాభరణం నరసయ్య పంతులు దుయ్యబట్టారు ఈ సందర్భంగా చేర్యాల అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాల వేసి అంగడి బజార్ చౌరస్తాలో మానవహారం ర్యాలీ నిర్వహించి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను ప్రభుత్వానికి ప్రజలతో కలిసి నిర్వహించారు జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ప్రజల ఆకాంక్షను గుర్తించాలని లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి బీఆర్ఎస్ సిపిఎం కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు