ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేసి విద్యార్ధుల కష్టాలు తీర్చాలి

జమ్మికుంట :నేటిధాత్రి

ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

నీట్ పరీక్ష, అవకతవకలపై కేంద్రం త్వరగా స్పందించకుంటే కేంద్ర మంత్రులను అడ్డుకుంటాం

* *జమ్మికుంటలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి*

ఈరోజు జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన సమావేశం లో మణికంఠ రెడ్డి మాట్లాడే

ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల నుండి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు సకాలంలో విడుదల చేయటంలో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడరని ప్రస్తుతం విద్యా సంవత్సరం పూర్తి అయిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు వెళితే కళాశాల యాజమాన్యాలు రియంబర్స్మెంట్ రాలేదని ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులకు చెప్తున్నాయని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు తీసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో బడ్జెట్ కళాశాలలు సైతం కళాశాల భవన కిరాయిలు కట్టలేక, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని వెంటనే ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉండి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడి ఫీజుల దోపిడీ చేస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు యూనిఫాం లు అమ్ముతున్న వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ఫీజుల దోపిడీని అరికట్టడంలో పూర్తిగా విఫలం అయ్యారని , ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలల్లో, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, నీట్ పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీకేజి లు జరిగి దేశంలో 24లక్షల మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాని మోడీ ఇప్పటికీ మాట్లాడకపోవడం సిగ్గుచేటని, బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే నీట్ లీకేజీలు జరిగాయని రాష్ట్రాల స్వయంప్రతిపత్తినీ దెబ్బ తీసే విధంగా నీట్ నిర్వహణ ఉందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పిన కేంద్రం పట్టించుకోవడం లేదని నీట్ పరీక్షను ఏ రాష్టం వారు వారే నిర్వహించకునేల కేంద్రం నిర్ణయం చేయాలని, నీట్ లీకేజి పై,అవకతవకలపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించి, ఎన్టీఏ జనరల్ డైరెక్టర్ ను భర్తరపు చేసి నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని తెలంగాణ నుండి కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్,కిషన్ రెడ్డి గార్లు నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని లేనిపక్షంలో వారిని తెలంగాణ లో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు

ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామరాపు వెంకటేష్, జిల్లా కోశాధికారి ఆలువాల విష్ణు, నాయకులు
అనిల్ కుమార్ , తౌకీర్, అనిల్ రెడ్డి, సాయి, వంశీ , గణేష్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version