అత్తింటి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.

#వివాహమైన మూడు నెలలకే ……ముగిసిన నూరేళ్ల జీవితం.

#యువతి మృతితో మండల కేంద్రంలో అలముకున్న విషాద ఛాయలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి: నిండు నూరేళ్లు జీవిస్తామని ఎన్నో ఆశలతో అత్తింటి ఇంటికి వెళ్లిన యువతికి అత్తింటి వారు వేదనకు గురై మానసికంగా కుంగి కట్టుకున్న వాడే కాల యముడుగా మారడంతో జీవితంపై విరక్తి చెంది పుట్టింటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది వివరాలకు వెళితే మండల కేంద్రానికి చెందిన వీర్ల రమేష్ రమ దంపతుల ఏకైక కుమార్తె రెడ్డి వైష్ణవి (25)ను ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన రెడ్డి పవన్ కుమార్ కు మార్చి 22న కట్నం కింద ఎకరం భూమి, 25 తులాల బంగారం, 20 లక్షల నగదు తో వివాహం జరిపించగా నెలరోజుల పాటు వైవాహిక జీవితం సక్రమంగా జరగగా గత రెండు నెలల నుండి అత్త మామ మరుదులు అదనపు కట్నం తీసుకురావాలని వేధించగా ఇవేమీ పుట్టింటి వారికి చెప్పకపోవడంతో తనలో తాను కుంగిపోతు ఉండేది తన భర్త మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్న విషయం తెలుసుకొని ప్రశ్నించగా నేను తనతోనే జీవితం కొనసాగిస్తానని నీకు ఇష్టం లేకపోతే నీ పుట్టింటికి వెళ్ళిపోయి చావు అని ఎన్నోసార్లు బెదిరించగా ఏమి దిక్కు తోచని సమయంలో పుట్టినిల్లు గుర్తు రాగా మంగళవారం సాయంత్రం నల్లబెల్లి మండల కేంద్రానికి చేరుకొని ఇంట్లో జరిగిన విషయంపై తల్లిదండ్రులకు తన మనసులో ఉన్న మాటను చెప్పుకొని బోరున విలపించింది అదే సమయంలో తన కూతురి బాధను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఓదార్చారు కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయాన్ని గమనించిన వైష్ణవి ఒక గదిలోకి చేరుకొని చీరతో ఉరి వేసుకోగా అది గమనించిన కుటుంబ సభ్యులు హుటా హుటిన అంబులెన్స్ లో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే యువతీ మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు తన కూతురి మరణానికి కారకులైన భర్త పవన్ కుమార్, అత్త మామ శారద శంకర్, తమ్ముళ్లు యోధనకుమార్, శ్రీనివాస్ వార్లపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేయగా మృతురాలి శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిర్వహించి మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు కారకులైన సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామారావు పేర్కొన్నారు.

#యువతి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి.

అన్యం పుణ్యం ఎరగని యువతి మృతికి కారకులైన అత్తింటి వారిని కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఎన్నో ఆశలతో వివాహం జరిగిన తర్వాత అత్తింటి వారి ఇంట్లో అడుగుపెట్టిన యువతని మానసికంగా వేదనకు గురి చేస్తూ అదనపు కట్నం తీసుకురావాలని వేధించడం వల్ల దానికి తోడు భర్త మరో యువతితో సహజీవనం చేయగా దానికి కుటుంబ సభ్యులు సైతం వత్తాసు పలకగా ఏమి దిక్కుతోచని స్థితిలో పుట్టింటికి వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version