కొల్లూరు గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా నవబు పేట మండలంలోని కొల్లూరు గ్రామ సమీపంలో బుధవారం రోజు సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టడంతో పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడిన వారిని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.TS 12 UB 2399 గల లారీ రంగయ్య బావి తండా కు చెందిన చందు నాయక్. గా గుర్తించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version