పైకి కనిపించని బలంతో బీఆరఎస్

· కాంగ్రెస్ గెలుపు వెనుక దాగున్న అసలు నిజం
· బీఆరఎస్‌కు ఇంకా గట్టి పట్టు
· కాంగ్రెస్ విజయం అంకెల గారడీ మాత్రమే
· ఇప్పటికీ కాంగ్రెస్‌ను ఢీకొట్టే స్థితిలో బీఆరఎస్
· కేసీఆర్, రేవంత్‌లు తిట్ల పురాణంలో దిట్టలు
· ఎంత తిడితే అన్ని ఓట్లు పెరుగుతాయనే ట్రెండ్ పెరిగే ప్రమాదం
· రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న తెలంగాణ సెంటిమెంట్
· పనితీరుపై ఆధారపడే పార్టీలకు ఓట్లు
· ప్రజల ఓటింగ్‌లో కనిపిస్తున్న సరికొత్త పరిణితి
· పార్టీలు దీన్ని గుర్తిస్తున్నాయా?
· గుర్తించిన పార్టీలకే భవితవ్యం
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 90కి పైగా మున్సిపాలిటీల్లో ఘనవిజయం సా ధించినట్టు గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించినప్పుడు ఇది నిజమైన గెలుపా లేక పైకి కనిపి స్తున్న వాపా? అన్న ప్రశ్న ఉదయించక మానదు. రాష్ట్రంలోని 123 (116G7) పట్టణ స్థానిక సంస్థలకు చెందిన 3వేల వార్డుల్లో కాంగ్రెస్ గెలుచుకున్నవి 1537. అంటే యాభై శాతం కంటే కొద్దిగా ఎక్కువ. కానీ కైవసం చేసుకున్న మున్సిపాలిటీల సంఖ్య 90 దాటుతోంది. అంటే ఇవన్నీకాంగ్రెస్ వాస్తవ బలాన్ని సూచించవనేది సుస్పష్టం. మొత్తం కాంగ్రెస్ ఆధీనంలోని మున్సిపాలిటీలను పరిశీలిస్తే రేవంత్ పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం కావడం సహజం. ఎందుకంటే గత మున్సిపల్ ఎన్నికల్లో 1181 వార్డుల్లో విజయం సాధించిన బీఆరఎస్ ఈసారి 781కే పరిమితం కావడం కూడా పై అభిప్రాయానికి బలం చేకూర్చే అంశం. నిజంగా బీఆరఎస్ కుప్పకూలిపోయిందా, కాంగ్రెస్ ఎవరూ ఓడించని స్థాయిలో బలపడిందా? అన్న అంశాలను పరిశీలించాలి. వీటిని పరిశీలించే ముందు 30`40 మున్సిపాలిటీల్లో ఏ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించలేదన్న సత్యాన్ని గుర్తిస్తే, గెలిచిన పార్టీది నిజమైన బలమా లేక ఓడిన పార్టీది వాస్తవ ఓటమా అన్నది స్పష్టమవుతుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 40.1% ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో 39.4% ఓట్లు సాధించిందంటే స్వల్పంగా ఓట్ల శా తం తగ్గిందని తెలుస్తుంది. అదేవిధంగా ఇవే ఎన్నికల్లో బీఆరఎస్ కేవలం 16.7% ఓట్లు సాధించగా మున్సిపల్ ఎన్నికల్లో 28.76%కు ఓటింగ్‌శాతం పెరిగింది. చూడటానికి కొంత విచిత్రం గా వుండవచ్చు కానీ, ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో 73% పోలింగ్ నమోదైంది. ఇది ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో జరిగిన 84% పోలింగ్ కంటే తక్కువ, గత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ 66% కంటే ఎక్కువ! దీన్ని బట్టి చూస్తే ఓటర్ల మనోగతం స్థానిక, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మారుతోంది. అంటే స్థానిక ఎన్నికల్లో స్థానిక సమస్యలకు, అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ సమస్యలకు, లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ సమస్యలకు ప్రాధాన్యతనిచ్చే పరిణితిని ఈ తరం ఓటర్లు ప్రదర్శిస్తున్నారనుకోవాలి. మరో కీలక అంశమేమంటే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో 171 మందిఇండిపెండెంట్లు గెలవడం! అంటే ఇక్కడ పార్టీకంటే పనిచేసే నాయకుడి సామర్థ్యం కూడా కీలకపాత్ర పోషిస్తుందనేది సుస్పష్టమవుతోంది. ఇక హైదరాబాద్ వంటి నగరాలో ఓటింగ్ 50శాతం కంటే తక్కువ వుంటుండగా గ్రామీణ ప్రాంతాల్లో 80`90శాతం వరకు నమోదవుతోంది. తక్కువ ఓటుశాతం నమోదవడం పట్టణప్రాంత ఓటర్లలో నెలకొన్న బద్ధకం లేదా నిర్లిప్తత కారణం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు, మద్యం పంపిణీ స్థానిక నేతలకు అంతా తెలిసి వుండటం వంటి కారణాలను చెప్పవచ్చు. కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39.4% ఓట్లు సంపాదించగా బీఆరఎస్ ఓట్లశాతం 37.3%. అంటే రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా దాదాపు రెండు శాతం మా త్రమే. అదే మున్సిపల్ ఎన్నికల్లో 39.8% ఓట్లు సాధిస్తే బీఆరఎస్‌కు 28.7% ఓట్లు పడ్డాయి. ఇక్కడ దాదాపు 11% ఓట్ల తేడా కనిపిస్తోంది. అదే గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40.1% ఓట్లు వస్తే బీఆరఎస్‌కు కేవలం 16.7% మాత్రమే వచ్చాయి. అంటే 2024 ఎన్నిక కు ఇప్పటికి పోలీస్తే బీఆరఎస్ 12% ఓట్లను పెంచుకోగలిగింది. ఈ విశ్లేషణను పరిశీలిస్తే బీఆరఎస్ ఓటమి శాశ్వతం కాదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పుంజుకునే అవకాశాలు మెండుగా వున్నాయన్నది స్పష్టమవుతుంది.
ఇక మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే 2020లో 100కు పైగా మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆరఎస్ ఇప్పుడు కేవలం 13కే పరిమితమైంది. అదే కాంగ్రెస్ స్కోరు 90 దాటింది. గత రెండు మూడు దశాబ్దాల క్రితం నాటితో పోలిస్తే ఓటర్లలో పరిణితి స్థాయి గణనీయంగా పెరి గిందనేది పోలింగ్ విశ్లేషణలను పరిశీలిస్తే తెలుస్తుంది. అంటే గుడ్డిగా ఒక పార్టీకి విధేయులుగా మెలిగే అలవాటు నుంచి ఓటర్లు క్రమంగా దూరమవుతున్నారు. ఈ మున్సిపల్ ఓట్లలో కాంగ్రెస్ కు 39.8% ఓట్లు, బీఆరఎస్‌కు 28.7% ఓట్లు రాగా బీజేపీకి 15.7% ఓట్లు రావడాన్ని గమని స్తే, కాంగ్రెస్, బీఆరఎస్‌లను ఇప్పటికీ స్థానిక సమస్యల పరిష్కారం విషయంలో ప్రజలు విశ్వసి స్తున్నారన్నది అర్థమవుతుంది. ఇక బీజేపీని ఇంకా జాతీయస్థాయి పార్టీగా, స్థానిక సమస్యలు దానికి పెద్దగా పట్టవన్న ఉద్దేశంతో ఓటర్లు వున్నారనుకోవాల్సి వస్తుంది. అంటే ఒక్కసారైనా బీజేపీ రాష్ట్ర అధికార పగ్గాలను చేపడితే ఓటర్లలో దానిపట్ల వున్న అభిప్రాయంలో తప్పనిసరిగా మార్పు వచ్చితీరుతుంది. మరో గుర్తించాల్సిన విషయమేంటంటే 2014`2018 మధ్యకాలంలో రాష్ట్రంలోతెలంగాణ ఉద్యమ ప్రభావం బలంగా కొనసాగింది. దాదాపు పధ్నాలుగేళ్లపాటు కేసీఆర్ నాయక్తవంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమం రేకెత్తించిన తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం అప్పటి వరకు బాగానే వుంది. కానీ తర్వాతి కాలంలో సెంటిమెంట్ స్థానాన్ని “పనితీరు ఆధారంగా” ఓటువేసే ప్రవత్తి పెరిగింది. అంటే అధికారంలో వున్నప్పుడు బీఆరఎస్ ఏమీ చేయలేదని కాదు. దేశంలోనే మొట్టమొదటిసారి రైతుబంధు ప్రవేశపెట్టిన ఘనత ఆ పార్టీదే. అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ కాలంలోనే పూర్తిచేసిన అద్భుత సామర్థ్యం కూడా కేసీఆర్ నాయకత్వానిదే. మిషన్ భగీరధ కేసీఆర్ చేపట్టిన పథకాల్లో కలికితురాయి వంటిదనే చెప్పాలి. ఇదే సమయంలో తెలంగాణ సాధకుడిగా తనకిక తిరుగులేదని భావించడం, అధికారానికి ఢోకా వుండబోదన్న ధీ మాకు వెళ్లడం కేసీర్ చేసిన పెద్దతప్పు. ఫామ్ హౌజ్ పాలన, మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ దొరకని దుస్థితి ఆయన రాచరిక పాలనకు చిహ్నంగా మారి, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి ఆకాశాన్నంటి, బీఆరఎస్‌ను పాతాళానికి తొక్కేశాయి. ఎదిగిన కొద్దీ ఒదగని మనస్తత్వం ఆయనతో పాటు కేసీఆర్‌ను నమ్ముకున్న పార్టీని దెబ్బతీశాయి. ఇక్కడ దెబ్బతీశాయనేదానికంటే, ప్రజలు ఒక్కసారి తమ శక్తి ఏమిటో ఆయనకు రుచి చూపించారనుకోవాలి.
విచారించాల్సిన విషయమేంటంటే ఇప్పుడు రేవంత్ కూడా సరిగ్గా ఇదే మాదిరి వ్యవహారశైలిని ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త పథకాల మాదిరిగానే తిట్ల పురాణాన్ని కూడా ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కగా, దీన్ని పరాకాష్టకు తీసుకెళ్లిన ఘనత రేవంత్‌కే చెందుతుంది. కేసీఆర్ త ప్పిదాలు, బీఆరఎస్‌లోని అవినీతిని వ్యతిరేకిస్తూ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పజెబితే ఇ ప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేబాటలో పయనిస్తోంది. కాంగ్రెస్ శైలి కప్పలతక్కెడ రాజకీయాలు లేకపోయినప్పటికీ, పార్టీలో పైకి వినిపించని అసమ్మతి రాగాలు, రేవంత్ ఛరిష్మా ీVA రులో ఎవరికీ వినిపించడంలేదు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో తన స్థాయి ఛరిష్మా గల నాయకుడు మరొకరు లేకపోవడం రేవంత్‌కు కలిసొచ్చిన అంశం. అధిష్టానానికీ ఆయన తప్ప మరో దిక్కులేదు. ఇన్ని సానుకూలతల మధ్య కేసీఆర్ తిట్లపురాణాన్ని రేవంత్ మరోస్థాయికి తీసుకెళ్లినా ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టారు. ఇదే ట్రెండ్ కొనసాగితే ఎంత గట్టి గా తిడితే అన్ని ఓట్లు రాలతాయన్న తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదముంది. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ కూడా తిట్ల పురాణంలో దిట్టగా పేరుపడ్డారు. అంటే తెలంగాణ రాజకీయాలు…సైద్ధాంతిక విభేదాలు, ఉద్యమ రాజకీయాల స్థాయిని దాటి తిట్ల స్థాయికి చేరుకున్నాయి. ఇదెంతకాలం కొనసాగుతుందో తెలియదు. ఇక కాంగ్రెస్‌లో మిగిలిన నాయకుల్లో కూడా రేవంత్ లేకపోతే పార్టీ మనుగడ వుండదన్న అభిప్రాయం ఏర్పడిందో ఏమో కానీ, మంత్రులంతా రేవంత్ భజన చేయడంలో పోటీపడుతున్నారు. ఇది తెలుగుదేశం, బీఆరఎస్, డీఎంకే, అన్నాడీఎం కే వంటి ప్రాంతీయ పార్టీల్లో కనిపిస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో వరుసగా దెబ్బతింటూ, పైకి లేవలేని స్థితిలో వున్న కాంగ్రెస్, తెలంగాణలో జవజీవాలు కల్పించిన రేవంత్‌ను వదులుకోలేని పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇదే పరిస్థితి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ది. కమ్యూనిస్టు నాయకత్వం ఆయనకు తý£గ్గాల్సిదే తప్ప ఆయన మాత్రం ‘తగ్గేదే లేదు’ అంటున్నారు. దీంతో పోలిట్ బ్యూరో తన ప్రాభవాన్ని కోల్పోయింది. తర్వాతి కాలంలో రాహుల్ తన వ్యవహారశైలి మార్చుకోకపోవడం, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ యధాప్రకారం ఓటమి చవిచూడటం జరిగితే, రేవంత్ కూడా పినరయి విజయన్ పంథాల్లో వెళ్లకూడదనేం లేదు. కాంగ్రెస్‌లో అధిష్టానాన్ని ధిక్కరించినవారు శంకరగిరి మాన్యాలు పట్టిపోవడమే మనకు ఇప్పటివరకు తెలుసు. ఇప్పుడు రే వంత్ అధిష్టానానికి అదే రుచిచూపిస్తే? అప్పుడు ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయన్న సామెత నిజమైందనుకొని మౌనంగా ఎవరి పనిలో వారు నిమగ్నం కావడం తప్ప చేసేదేమీ వుండదు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version