ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలి.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఇండియన్ రెడ్ క్రాస్ సేవలు, ఎన్నికలు, సభ్యత్వాల నమోదు తదితర అంశాలపై సమీక్ష

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలని జిల్లా రెడ్ క్రాస్ కమిటీ చైర్మన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐ.ఆర్.సీ.ఎస్) సేవలు, ఎన్నికల నిర్వహణ ,సభ్యత్వాల నమోదు తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అందించిన సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఇతర అంశాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ సేవలు అందింస్తున్న సొసైటీ సభ్యులను అభినందించారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ గడువు తేదీ 8.5.2025 నాటికి ముగిసిన నేపథ్యంలో నూతన కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. వేములవాడ లోని ఏరియా హాస్పిటల్ ఆవరణలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కోసం స్థలం కేటాయించామని తెలిపారు. భవన నిర్మాణానికి నిధులు దాతల నుంచి సేకరించాలని, ఐఆర్సీఎస్ రాష్ట్ర చైర్మన్ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. అలాగే నూతన సభ్యత్వాలు చేయించాలని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు, ఉపాధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రాయకరరావు వేణు కుమార్.
ప్రధాన కార్యదర్శి తాటిపాముల శివప్రసాద్. కోశాధికారి బుడిమె శివప్రసాద్. కమిటీ సభ్యులు సంగీతం శ్రీనివాస్. యెల్ల లక్ష్మీనారాయణ. దేవులపల్లి రాజమల్లు. చిదుర నాగ శంకర్. కమటాల రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version