మానవ జీవితానికి డ్రగ్స్ అత్యంత ప్రమాదకరం..

కలెక్టర్ విజయేందిర బోయి, ఐఏఎస్

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి..

జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీస్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్ నుండి తెలంగాణా కూడలి వరకు జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీస్ ఆధ్వర్యం లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. తెలంగాణ కూడలి నందు మాదకద్రవ్యాల దుర్వినియోగం/ అక్రమ రవాణా కు వ్యతిరేకంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయడం జరిగినది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మానవ జీవితానికి డ్రగ్స్ అత్యంత ప్రమాదకరమని అన్నారు. మానవ జీవితంలో డ్రగ్స్ కుటుంబ వ్యవస్థను చిన్న భిన్నం చేస్తుందని పేర్కొన్నారు. విద్రోహశక్తుల చేతుల్లో యువత జీవితాలు చిన్నాభిన్నమవుతుందని వాపోయారు. తెలిసి తెలియని వయసులో పిల్లలు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలని తమ అక్రమ ఆదాయం కోసం పిల్లలకు యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని,విద్యార్థులు పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు కర్చు పెడుతుందని, తెలియజేశారు. విద్యార్థులు తాత్కాలిక సంతోషాల జోలికి వెళ్లి వారి జీవితాలను బలి చేసుకోవద్దని, పిల్లలు అడ్డదారులు తొక్కుతే కుటుంబమే కాకుండా సమాజం మొత్తం బాదపడాల్సి వస్తుందని అన్నారు, మాదకద్రవ్యాల నివారణకు ఏ స్థాయిలో అయినా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటామని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మాదకద్ర వ్యాల వినియోగం మరియు రవాణా ప్రమాదకరంగా పరిణమిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ నిఘా విస్తృతం చేసిందని అన్నారు. మాదకద్రవ్యాల నిరోధించడానికి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తామని, మాదకద్రవ్యాల రవాణాలో ఎంతటివారున్న ఉపేక్షించబోమని అన్నారు, ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల జోలికి పోకుండా సరైన నిర్ణయాలు తీసుకోని వారి జీవితాలను సక్రమమైన మార్గంలో ముందుకు వెళ్లాలని, మీరందరి భవిష్యత్తు చక్కగా ఉండాలని, సరైన మార్గంలో చదువుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్న మీ తల్లిదండ్రుల ఆశలు ఆశయాలకు అనుగుణంగా జీవితంలో ముందుకు వెళ్లాలని అన్నారు.ఒక్కసారి ఈ మాదకద్రవ్యాల బారిన పడి,టేస్ట్ చూద్దామని అనుకున్నారంటే ఒక్కసారి తో ఆగిపోకుండా అనేకసార్లు తీసుకొనడం వలన మీ ఆరోగ్యము క్షీణించడమే కాకుండా మీపై క్రిమినల్ కేసులు కూడా అవుతాయి అట్టి కేసులలో కూడా 10 సంవత్సరాలు లేక జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉండడం వల్ల, మీ యొక్క జీవితం మొత్తం జైల్లో ఉండి శిక్షను అనుభవించవలసి వస్తుంది. అందుకనే యువత ఎవరు కూడా తమ జీవితాన్ని ఈ మాదకద్రవ్యాల బారిన పడకుండా చూసుకోగలరని కోరారు. అలాగే గంజాయి అమ్ముతున్నట్లు ఎలాంటి సమాచారం ఉన్న డయల్ 100 కి గానీ, జిల్లా కంట్రోల్ రూం నెంబర్ 8712659360 గానీ లేకా మీ దగ్గరలోని పోలీసు స్టేషన్ కి సమాచారం ఇవ్వగలరని కోరారు,
డ్రగ్స్ కంట్రోల్ చేయడం పోలీసులు మాత్రమే కాకుండా ప్రజలతోపాటు ఇతర విభాగాల సహకారం కూడా ఉండాలని అన్నారు కలిసికట్టుగా డ్రగ్స్ పై యుద్ధం చేస్తే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చూడొచ్చని తెలిపారు.
అనంతరం జిల్లా పోలీసుల తరపున మాదకద్రవ్యాల నివారణ మరియు రవాణా పై వ్యాసరచన మరియు ఉపన్యాసం పోటీలు నిర్వహించగా, జిల్లా పరిషత్ కార్యాలయంలో హాల్ నందు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానోత్సవం జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీ శివేంద్ర ప్రతాప్, ఐఏఎస్ , భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఎక్సజ్ , జేరినా బేగం, డి డబ్ల్యూ ఓ,మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version