ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నిర్వహణ
అద్వాన్నంగా సినిమా ధియేటర్స్
భద్రాచలం నేటి ధాత్రి
అధికారులు చర్యలు తీసుకోవాలి
ఎస్ కె అజీమ్,ప్రధాన కార్యదర్శి, టీడీపీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం
భద్రాచలంలో ఈ నెల 27న రిలీజ్ అవ్వబోతున్న కల్కి సినిమాకు ఎప్పుడు లేని విధంగా హైదరాబాదులో ఐమాక్స్ థియేటర్లో రేటు కన్నా ఎక్కువగా రూ.375లు ఒక షోకు తీసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా థియేటర్ యజమానులు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచారు. సామాన్య మానవుడు అభిమాన హీరో సినిమా చూడాలంటే రూ.375లు అంటే అసలు చాలామందికి సాధ్య పడదు తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేసిన జీవోలో 75 రూపాయలు పెంచమని ఉంది కానీ నిబంధనలకు విరుద్ధంగా భద్రాచలం థియేటర్ యజమానులు 375 రూపాయలు పెంచడం జరిగింది అదే కాకుండా ఆన్లైన్లో పెడుతున్నారు.దీంతో అదనంగా రూ.30లు చెల్లించాల్సి వస్తోంది. థియేటర్లు చూస్తే అంతంత మాత్రమే. పేరుకు మాత్రమే ఏసిగా, ఏసీ హాళ్లు.కనీసం గాలి కూడా రాని పరిస్థితి. ఘోరమైన సీట్లు ఏర్పాటు. సీట్ మీద కూర్చుంటే చేతులకు,కాళ్ళకి దెబ్బలు తలిగే పరిస్థితి. టాయిలెట్లు అద్వాన్నంగా ఉన్నాయి. భద్రాచలంలో ఆన్లైన్లో టికెట్స్ విక్రయం వ్యవస్థను తీసేయాలి.టికెట్లు బుకింగ్ లోనే అమ్మాలి.ప్రభుత్వం నిర్ణయించిన సాధారణ రేట్లకు టికెట్లు అమ్మాలి. అధికారులు భద్రాచలం సినిమాహాల్స్ ను తనికీ చేయాలి. తగు విచారణ చేపట్టాలి. అభిమానులకు జరుగుతున్న అన్యాయంను అరికట్టాలి.
ఎస్ కె అజీమ్,
ప్రధాన కార్యదర్శి, మహబూబాబాద్ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గం, భద్రాచలం