ప్రతి ఒక్కరు డ్రగ్స్ నిర్మూలన కై పోరాడాలి
హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల పట్టణంలో అంతర్జాతీయ మారక ద్రవ్యాలు మరియు డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ నిర్మూలకై విద్యార్థుల అవగాహన కొరకు నిన్నటి రోజున వ్యాసరచన పోటీ నిర్వహించారు ఈరోజు చేర్యాలలో గాంధీ చౌరస్తా నుండి వీరభద్ర కళామందిర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు పెద్ద ఎత్తున విద్యార్థులు మరియు పోలీస్ వారు ప్రజలను చైతన్యం చేశారు ఈ సందర్భంగా అంగడి బజార్లో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్ మాట్లాడుతూ మారక ద్రవ్యాలు డ్రగ్స్ తో విద్యార్థులు మరియు యువకులు చెడుదారులలో నడుస్తూ వారి వారి కుటుంబాలను మరియు సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నారు దీనిని అరికట్టవలసిన అవసరం ఉన్నది అన్నారు మరియు డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో చేర్యాల ఎస్సై దామోదర్ మరియు ఎక్సైజ్ శాఖ ఎస్సై మరియు కార్యక్రమం వ్యాఖ్యాతగా రామచంద్రమూర్తి మరియు పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు