నడికూడ,నేటి ధాత్రి:
మండలంలోని నర్సక్కపల్లి గ్రామం, అంబేద్కర్ కాలనీలో ఇంటిఇంటికి తిరుగుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు మరియు పరకాల నియోజకవర్గంలో శాసనసభ్యులు గా చల్లా ధర్మారెడ్డి చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి అని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమం లో గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్లపెల్లి రమేష్, గ్రామ సర్పంచ్ తిప్పర్తి సాంబశివ రెడ్డి, జడ్పీటీసీ కోడెపాక సుమలత కరుణాకర్,మాదారం సొసైటీ డైరెక్టర్ బైరెడ్డి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ బంగారి బాబు,పరకాల ఏఎంసి మాజీ డైరెక్టర్ భాషబోయిన కొమురయ్య,సీనియర్ నాయకులు ఐలయ్య, కుమారస్వామి, మల్లయ్య,జన్ను స్వామి,విజేందర్, రాజమౌళి,భాస్కర్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.