సజావుగా పోలింగ్ నిర్వహణకు పకడ్బంది ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక వసతుల కల్పన

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు కట్టుదిట్టమైన చర్యలు

ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పుల అందేలా పటిష్ట కార్యాచరణ

భూపాలపల్లి నేటిధాత్రి

బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశం మందిరంలో కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, భూపాల్ పల్లి సాధారణ పరిశీలకులు అభయ్ నందన్ అభస్తా, ఎన్నికల వ్యయ పరిశీలకులు కౌశిక్ రాయ్, పోలీస్ పరిశీలకులు అమిత్ కుమార్ లతో కలిసి సంబంధిత అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మౌలిక వసతుల కల్పన బాధ్యత సదరు జిల్లా యంత్రాంగం పై ఉంటుందని, భూపాల్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 317 పోలింగ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక వస్తువుల కల్పన పూర్తి చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రాలు త్రాగునీరు విద్యుత్తు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
భారత ఎన్నికల కమిషన్ 80 ఏళ్లు పై పడ్డ వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిందని, దీనికోసం భూపాలపల్లి దాదాపు 144 మంది దరఖాస్తు చేసుకున్నారని, రిటర్నింగ్ అధికారి ద్వారా వీరి వివరాలు రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందజేస్తామని తెలిపారు.
నవంబర్ 18న బ్యాలెట్ పేపర్ ముద్రణ జరుగుతుందని, అనంతరం రిటర్నింగ్ అధికారి సదరు ఓటర్ల ఇంటి నుంచి ఓటు హక్కు స్వీకరించేందుకు బృందాలను వీడియోగ్రఫీ తో కలిపి పంపుతారని, రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం హాజరు కావచ్చు అని కలెక్టర్ తెలిపారు.
భారత్ ఎన్నికల కమిషన్ 13 రకాల అత్యవసర సేవా విభాగంలో పనిచేసే వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించిందని వీరి కోసం రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఒక తేదీని నిర్ణయించి, ఆరోజు పోస్టల్ ఓటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, సదరు వివరాలు రిటర్నింగ్ అధికారి అందజేస్తారని తెలిపారు.
ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు సైతం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుందని, వీరి వివరాలను సైతం రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేస్తామని అన్నారు. ఎన్నికల పోటిలో 15 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటిలో ఉంటే అదనపు బ్యాలెట్ యూనిట్ అవసరమవుతుందని, మరో మారు ఈవిఎం ర్యాండమైజేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఓటర్ స్లిప్పుల పంపిణీ పై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఎన్నికల సమీపిస్తున్న సమయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన విఐపి ప్రచారం కోసం హెలిపాడ్ వినియోగించుకోవడానికి 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
ఎన్నికల సమయాలలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఉండే ఫిర్యాదుల పరిష్కారానికి సి విజల్ యాప్ ను విస్తృతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.సి విజల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు 100 నిమిషాలో పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.
ఎన్నికలలో విద్వేష ప్రసంగాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, అక్రమ డబ్బు మద్యం పంపిణీ, ఇతర ఉల్లంఘనలపై సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుని ఫోన్ నెంబర్ ఎవరికి తెలియదని, వివరాలు గోప్యంగా ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని అన్నారు.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు జిల్లాలో నిర్దేశించిన రేట్ చార్ట్ ప్రకారం నమోదు చేయడం జరుగుతుందని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సైతం అభ్యర్థుల ఖాతాలో నమోదు చేయడం జరుగుతుందని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వీడియో, ఆడియో లకు ముందస్తు అనుమతి తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే , అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎన్నికల డిఎస్పి రాములు నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version