నేరెళ్ల పి హెచ్ సి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్…..

నేరెళ్ల పి హెచ్ సి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇన్చార్జి కలెక్టర్. గరీమా అగ్రవాల్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. సీజనల్ వ్యాధులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని. ఈ సీజన్లో వచ్చే వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని. వైద్యుల. సిబ్బంది. హాజరు రిజిస్టర్. రక్త పరీక్షలు చేసే ల్యాబ్. మందులు ఇచ్చే గది. ఇతర గదుల ఆవరణ ను. పరిశీలించారు. వ్యాక్సిన్ల. మందుల నిలువుపై.ఆరా తీశారు ఎలాంటి సమాచారం లేకుండా. విధులకు . హాజరుకాని. ఫార్మసిస్టు సూపర్వైజర్ కు సోకాజు నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్యాధికారిని .ఆదేశించారు. రోజు ఆసుపత్రికి ఎందరో రోగులు వస్తున్నారని. ఎందరు గర్భిణీలు వైద్య సేవలు పొందుతున్నారని ఆరా తీశారు. వైద్యులు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై అందరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో నేరెళ్ల. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version