ప్రభుత్వాలు కొనసాగితే అభివృద్ధి జరుగుతుంది.

 ప్రభుత్వాలు కొనసాగితే అభివృద్ధి జరుగుతుంది…

 

CM Chandrababu: 2019 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిచి ఉంటే.. రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదని, ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినవాళ్లకు.. కేవలం 11 సీట్లే వచ్చాయని అన్నారు.

Amaravati: వైకుంఠపాళీ అభివృద్ధి వద్దని.. ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని, ప్రభుత్వాలు కొనసాగితే.. అభివృద్ధి జరుగుతుందని (Stable Governance and Development) సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. సుస్థిరపాలన ఉంటే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, యూపీ (UP) కొన్నేళ్లుగా ఒకే ప్రభుత్వంగా ఉందని.. ఒకప్పుడు యూపీ అంటే వెనుకబాటు తనం ఉండేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలను ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉందని, అందుకే దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు.
డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదు…

2019 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిచి ఉంటే.. రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదని, ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినవాళ్లకు.. కేవలం 11 సీట్లే వచ్చాయని వైసీపీని ఉద్దేశించి అన్నారు. డబ్బులతో ఎన్నికల్లో గెలవలేమనే విషయం స్పష్టమైందన్నారు. అభివృద్ధితో, ఆదర్శంతో రాజకీయాలు చేద్దామని పిలుపిచ్చారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ఎన్నికల ముందు కాదని.. నిత్యం ప్రజల్లో చర్చనీయాంశం చేయాలన్నారు. ఎన్నికల ముందు మాట్లాడితే.. ఓట్ల కోసం మాట్లాడారని అంటారని, గత ప్రభుత్వం తెచ్చిన బ్యాడ్ ఇమేజ్ పొగొట్టాలంటే చాలా సమయం పడుతుందన్నారు. కానీ టీడీపీకి ఉన్న బ్రాండుతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

కేంద్ర సహకారం లేనిదే వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఏడాదిలో బయటకు తెచ్చే వాళ్లం కాదని, మనం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయమని సీఎం చంద్రబాబు అన్నారు. మనకు అధికారం ముఖ్యం కాదని.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. కేంద్రంలో మనకు ఎప్పుడు అవకాశం వచ్చినా.. రాష్ట్రాభివృద్ధికే సహకరిస్తున్నామని చెప్పారు. ఏ రాజకీయ పార్టీకి రానన్ని అవకాశాలు.. టీడీపీకి వచ్చాయన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు వివరించడం.. ఏమైనా తప్పులు జరిగాయనుకుంటే సరిదిద్దుకోవడం వంటివి చేయాలని సూచించారు. చేసిన ప్రతి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. అందుకే నెల రోజులు ప్రచారం చేసే కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు.

గత ఐదేళ్లలో విధ్వంసం చూశాం..

గత ఐదేళ్లల్లో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, వ్యవస్థలను నాశనం చేశారని, కేంద్ర నిధులను పక్కదారి పట్టించారని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీని అగ్రగామిగా తీసుకురావాలనే సంకల్పంతో పని చేస్తున్నామని, ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని మనకు సహకరించారన్నారు. దక్షిణ భారత దేశంలో ఏపీది విభిన్నమైన పరిస్థితి అని, రాష్ట్ర ఆదాయంలో సర్వీస్ సెక్టార్ కీలకమని అన్నారు. సేవల రంగాలకు, పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వాలని, వ్యవసాయాన్ని మరిచిపోకుండా.. అభివృద్ధి చేయాలన్నారు. చెప్పిన హామీలను అమలు చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. పాలసీలు మంచివి అయితే సరిపోదని.. అమలులో తప్పులు జరగకూడదని చంద్రబాబు అన్నారు.

నేరస్తుల్ని నేరస్థులుగానే చూస్తాం..

నేరస్తులను నేరస్థులుగానే చూస్తామని, తప్పులు చేసిన వారు.. ప్రత్యర్థి పార్టీలో ఉంటే అరెస్టు చేయకూడదా.. చర్యలు తీసుకోకూడదా.. అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. సత్తెనపల్లి హిట్ అండ్ రన్ వ్యవహారంలో ఏం జరిగిందో అందరం చూశామన్నారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే.. వారిని కాపాడి..ఆస్పత్రికి పంపుతామని, కానీ జగన్ కారు కింద కార్యకర్త పడిపోతే.. పక్కకు పడేసి వెళ్లిపోయారని విమర్శించారు. దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన తర్వాత కూడా సొంత మీడియా ఉందని తప్పుడు ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. పరామర్శల పేరుతో గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్‌ల వద్దకు వెళ్తారా అని ప్రశ్నించారు. చేస్తున్న మంచి పనులతో పాటు, మారుతున్న రాజకీయాలను ప్రజలకు వివరించాలన్నారు. ఆర్ధిక ఉగ్రవాదం దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమని అన్నారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని ఏరి పారేయాలన్నారు. రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలు ఏం చేశారో జనానికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. వివేకా హత్యను ఎలా ఏమార్చారో ప్రజలకు వివరించాలని, వివేకా హత్య విషయంలో ప్రజల్నే కాదు.. తననూ ఏమార్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఆనాడే వివేకా హంతకులను పట్టుకుని ఉంటే.. 2019 ఎన్నికల్లో ఓడిపోయేవాళ్లం కాదని, ఎన్నికల హడావుడి పక్కన పెట్టి 2 గంటలు వివేకా హత్యపై శ్రద్ధ పెట్టి రికార్డులు సీజ్ చేసి ఉంటే 2019లో మనమే గెలిచేవాళ్ళమని అన్నారు. మళ్లీ ఇప్పుడు మరిన్ని డ్రామాలకు వైసీపీ నేతలు తెరలేపుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version