అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల పట్ల పిర్యాదు.

*అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల పట్ల డిఈఓ పిర్యాదు *

పాఠశాలలను సీజ్ చేయాలి…గడ్డం నాగార్జున

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాలని కోరుతూ ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కు ఆయన కార్యాలయంలో మెమోరాండం అందజేశారు.

ఈ సందర్భంగా ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున మాట్లాడుతూ నర్సంపేట పట్టణ కేంద్రంలోని 25 ప్రైవేటు పాఠశాలలకు పర్మిషన్ ఉంటే , అనధికారికంగా 14 ప్రైవేట్ పాఠశాలలు అందులో గీతాంజలి స్కూల్, డఫోడిల్స్ హై స్కూల్ , విజ్డమ్ హై స్కూల్, మదర్స్ లాండ్ హై స్కూల్ , కేఎస్ఆర్ శ్రీఅభ్యాస్ హై స్కూల్, ఎస్.పి.ఎస్ హై స్కూల్ తదితరుల స్కూలు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టా రాజ్యాంగ వివరిస్తున్న కూడా స్థానికంగా ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు చూసి చూడకుండా వదిలేయడం సిగ్గుచేటని అన్నారు.

Education Officer.

 

పట్టణంలో అనధికారికంగా నడపబడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై డిఈఓ సమగ్ర విచారణ జరిపించి తక్షణమే వాటిని మూసివేసి,విద్య శాఖను తప్పుదోవ పట్టిస్తున్న ఆ స్కూల్ యాజమాన్యాలపై చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి,జిల్లా నాయకులు పోలబోయిన రాజు, జావాజి శ్రిజిత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version