కరోనా రక్కసి.. గుబులు రేపుతోన్న కొత్త వేరియంట్..

కరోనా రక్కసి.. గుబులు రేపుతోన్న కొత్త వేరియంట్.. ఈ ప్రాంతాలకు అస్సలు వెళ్లకండి

 

నేటిదాత్రి :

 

 

 

 

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు,మరణాలు పెరుగుతున్నాయి.

దక్షిణాసియాలో దేశాలు చైనా, సింగపూర్, థాయ్ లాండ్ తర్వాత భారత్‌లో కోవిడ్ వ్యాప్తి పెరుగుతుంది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటి 4026 కి చేరింది..

గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు.

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు,మరణాలు పెరుగుతున్నాయి.

దక్షిణాసియాలో దేశాలు చైనా, సింగపూర్, థాయ్ లాండ్ తర్వాత భారత్‌లో కోవిడ్ వ్యాప్తి పెరుగుతుంది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటి 4026 కి చేరింది..

గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు.

మహారాష్ట్రలో రెండు కేరళ,తమిళనాడు,పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో మరణం నమోదు అయ్యింది..

యాక్టివ్ కేసుల్లో సగానికిపైగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ ,పశ్చిమ బెంగాల్ ,కర్ణాటకలోనే ఉన్నాయి ..

కేరళలో అత్యధికంగా 1416 యాక్టివ్ కేసులున్నాయి,మహారాష్ట్రలో 494, ఢిల్లీలో 393 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 37 మంది మృతి చెందారు.

కేరళలో తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతు 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు..

మహారాష్ట్రలో 70, 73 ఏళ్ల మహిళలు మృతి చెందారు..

తమిళనాడులో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న 69 ఏళ్ల మహిళ మృతి చెందారు.

పశ్చిమ బెంగాల్‌లో తీవ్రమైన కరోనరీ సిండ్రోమ్, సెప్టిక్ షాక్, తీవ్రమైన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళ మృతి చెందింది.

దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో 28,తెలంగాణలో 4 యాక్టివ్ కేసులున్నాయి..

ఒడిశాలో 15 యాక్టివ్ కేసులు,కర్ణాటకలో 311 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

2020-21-22 తరువాత కోవిడ్ కేసుల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది..

వైరస్ వేరియంట్లలో వస్తున్న మార్పులు ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణంగా గుర్తించారు వైద్య అధికారులు..

COVID 19 వేరియంట్ ఓమిక్రాన్ NB.1.8.1, భారతదేశం అంతటా కేసుల పెరుగుదలకు కారణం.

ఇది అంటువ్యాధి, పరివర్తన చెందే వ్యాప్తి చెందే లక్షణం కలిగింది..అందుకే ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది

కోవిడ్ లక్షణాలు..

 

జ్వరం, దగ్గు,జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులు, అలసట ముక్కు కారటం వంటివి తాజాగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ వేరియంట్ లక్షణాలుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)వెల్లడించింది… ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు బూస్టర్ డోస్ తీసుకున్న వారికి సైతం మారుతున్న వేరియంట్ల రీత్యా కోవిడ్ సోకే అవకాశం ఉంది… సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం , పరిశుభ్రత పాటించడం కోవిడ్ దరిచేరకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యలుగా కొనసాగుతున్నాయి..

దేశంలో కేసుల పెరుగుదల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ఆసుపత్రులకు,ప్రజలకు సూచనలు జారీ చేశాయి..

 

పడకల లభ్యత, ఆక్సిజన్ సిలిండర్లు పునరుద్ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలతో ఆసుపత్రులు హై అలర్ట్‌లో ఉంచాయి.

అనేక ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డులను సైతం ఏర్పాటు చేస్తున్నాయి..

ప్రస్తుత కోవిడ్ కేసుల పెరుగుదలతో భయపడవద్దని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు తెలియజేసింది.

13 బంతుల్లో మదగజంలా మీదదిపోయాడు..
పాములను పట్టి అడవిలో వదులుదామకున్నాడు..
కట్ చేస్తే..
పైకి చూసి మందు సిట్టింగ్ అనుకునేరు..
అసలు విషయం తెలిస్తే కోవిడ్ కేసుల పెరుగుదల..
కేంద్రానికి నోటీసులు..

 

దేశంలో కోవిడ్-19 మహమ్మారి ఇంకా ముగియలేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

కోవిడ్ శాంపిల్స్ సేకరణ, సేకరణ కేంద్రాలు,శాంపిల్స్ రవాణాకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది..

జనవరి 27, 2023న డివిజన్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులపై ప్రభుత్వం చర్య తీసుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ డాక్టర్ రోహిత్ జైన్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు..

కోవిడ్ శాంపిల్స్ సేకరణ విధానాలు, సేకరణ కేంద్రాల పనితీరు నమూనాల రవాణాకు కనీస ప్రమాణాలను ఏర్పాటు చేయడంపై ఇప్పటివరకు ఎటువంటి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయలేదని జైన్ పేర్కొన్నారు.

దీంతో కోవిడ్ పరీక్షల విధానంపై ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ (CGSC) మోనికా అరోరాను ఆదేశించింది.

తదుపరి విచారణ జూలై 18న కొనసాగనుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version