విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి.

విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి

ధరణి చేతిలో చిక్కుకున్న భూములకు విముక్తి

రైతులను హరిగోశపెట్టిన ధరణి నీ బంగాళాఖాతంలో పాతర

భూభారతి పోర్టల్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో అమీనాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి జిల్లాకాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటి ఒక్కటిగా అమలుపరుస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతుంది. నిన్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళి ఇచ్చే సందర్భంలో మూడు దశాబ్దాల పాటు ఎస్సీ కుల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న వర్గాలకు ఆనాడు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ సర్కారు 15% రిజర్వేషన్లను మూడు భాగాలుగా విభజించి అమలు చేయడానికి జీవోను కూడా జారీ చేయడం జరిగింది. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఉషా మేహరా కమిషన్ వేసి ప్రయత్నం చేయడం జరిగింది న్యాయ చిక్కుల వలన చేయలేదు. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం ఉత్తంకుమార్ రెడ్డి చైర్మన్, దామోదర రాజ నరసింహ వైస్ చైర్మన్ సభ్యులుగా పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, మల్లు రవి లను ఉప సంఘం ఏర్పాటు చేసి వారి స్థితిగతులపై అధ్యయనం చేసి వారి సిఫారసు మేరకు ఏకసభ్య కమిషన్ విశ్రాంత జస్టిస్. షమీం అక్తర్ ను నియమించి వారి సలహా సూచనలను తీసుకొని మంత్రి వర్గం ఆమోదించి, తర్వాత అసెంబ్లీలో కూడా ఆమోదించి చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టం నిన్నటి నుండే అమలులోకి వస్తు ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించి ఉద్యోగ రాజకీయ అన్ని రంగాలలో కూడా అమలు చేసే విధంగా జీవో జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి పోర్టల్ ను ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ధరణి పోర్టల్ వలన ఎన్నో ఇబ్బందులకు గురైన రైతుల ఆవేదనను చూసి ఆనాడు మేము అధికారంలోకొస్తే ధరణి పోర్టల్ బంగాళాఖాతంలో వేసి భూమాత పోర్టల్ ను తెస్తానని మాట ఇచ్చిన ప్రకారం భూమాత పోర్టల్ ను తెచ్చి రైతులందరికీ,ప్రజలకు సులువుగా భూమి యొక్క సమస్యలను పరిష్కార దిశగా నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి ప్రజల నుండి వస్తున్నటువంటి వినతులను స్వీకరించి ఆ సమస్యలను పరిష్కార దిశగా కొత్త మాడ్యూలను ఏర్పాటు చేస్తూ పూర్తిస్థాయిలో రాష్ట్రంలో జూన్ 2 నుండి అమలు చేసే దిశగా ప్రభుత్వం కృతనిచ్చయంతో ఉండడం అభినందనీయం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల అండగా ఉండే పార్టీ వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో దొడ్డు బియ్యాన్ని పేద ప్రజలకు ఇస్తా ఉంటే వాటిని పేద ప్రజలు తినకుండా విక్రయిస్తా ఉంటే వ్యాపారం చేసిన వారు లక్షల రూపాయలుదండుకున్నారు తప్ప పేదవాని ఆకలి తీరనటువంటి పరిస్థితిని చూసి కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవానికి సన్న బియ్యం అందే విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాన్ని తీసుకువచ్చి పేదవాడు సన్న బియ్యంతో బుక్కెడు అన్నము కడుపునిండా తిని నిత్యం పండగ వాతావరణం ప్రతి పేదల ఇండ్లలో ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజలందరూ దన్నుగా ఉండి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మరొక్కసారి విన్నవించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి అంబటి. లక్ష్మి,అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మందుల కృష్ణమూర్తి, అంబేద్కర్ యువజన సంఘం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వేల్పుగొండ ఏలియా, మండల ఉపాధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు సామ సుధాకర్ రెడ్డి, జన్ను కట్టయ్య, లింగాల నేతాజీ, లాకావత్ బాలు నాయక్, ఇనుముల కర్ణాకర్, వెంకట్రాం నరసయ్య, సామ శ్రీనివాస్, కొడారి. నాగేంద్రబాబు, భోగం రమ, కొనకటి మధు, సింగిరెడ్డి కృష్ణ, కొనకటి వెంకటరెడ్డి, కుసుమ సాంబమూర్తి, వంతడుపుల సమ్మయ్య పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version