రూ.1000 కోట్ల నిధుల పనులకు సీఎం శంకుస్థాపనలు
ఈ నెల 5న నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దొంతి,సీపీ సన్ ప్రిత్ సింగ్,డీసీపీ అంకిత్ కుమార్.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలో ఈ నెల 5న సుమారు 1,000 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయుటకోసం వస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హెలిక్యాప్టర్ ల్యాండింగ్, భారీ బహిరంగ సభ స్థలాలను మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ లతో కలిసి పరిశీలించారు.కార్యక్రమంలో ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి,ఎస్బి ఏసీపీ జితేందర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్,టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,డాక్టర్ పులి అనిల్,నర్సంపేట సొసైటి చైర్మన్ బొబ్బల రమణారెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఓర్సు అంజలీ,గంధం నరేష్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లగౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షలు రూపిక శ్రావణ్ కుమార్, మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాలాయి రవికుమార్, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, పబ్బతి సతీష్ రెడ్డి, పోతారబోయిన చంద్రమౌళి, బాణాల శ్రీనివాస్, మేరుగు కిరణ్, గద్ద అఖిల్, తదితరులు పాల్గొన్నారు.
