బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వర్గ పోరు.

బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వర్గ పోరు

విభేదాల సమస్య సమన్వయం జరిగేనా!

పార్టీ సస్పెండ్ ను ఎత్తి వెయ్యాలని డిమాండ్

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలకు సమస్య సమన్వ యం జరుగుతుందా! గండ్ర వర్సెస్ చారి కార్యకర్తల మధ్య సమస్య తీరుతుందో లేదో !ఈ సమస్య ఇంతవరకు ఓ కొలిక్కి వచ్చిన దాఖనాలు కల్పించడం లేదు ఈ వివాదం ఇంకా చక్క బడకపోవడంతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మండల పరిధిలోని పలు గ్రామాల్లో కూడా పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు చాప కింద నీరులా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు సమస్య పోతాయా! బీఆర్ఎస్ పార్టీ మండల పరిధిలో కార్యకర్తలకు సమావేశం నిర్వహించినప్పుడు మమ్మల్ని దూరంగా ఉంచడం నిదర్శనం. కేసీఆర్ జెండా ఎజెండా కింద మేము పనిచేస్తాం. బీఆర్ఎస్ పుట్టుక నుండి ఉద్యమం చేసి జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బాధాకరం. పార్టీ నుండి సస్పెండ్ ను ఎత్తివే యాలని డిమాండ్ చేశారు.

 

BRS

 

కారులో కొట్లాట

మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నా యి చాలా గ్రామాల్లో గండ్ర వర్సెస్ చారి కార్యకర్తల మధ్య కొట్లాటలు చోటు చేసుకుంటు న్నాయి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది ఒకరిపై ఒకరు దుష్ప్రచారం కొనసాగు తుంది. సమస్యను సమన్వ యము చేయకపోతే పార్టీ యంత్రాంగం ఎలా ఎదుర్కొని చల్ల బరచ గలదో వేచి చూడా ల్సిందే మరి!ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు గుర్రం రవీందర్, మాజీ మార్కెట్ డైరెక్టర్ నిమ్మల మహేందర్, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఇమ్మడిశెట్టి రవీందర్, మాజీ మండల ఉపాధ్యక్షులు పల్లెబోయిన సారయ్య, అశోక్, జుపాక సారయ్య అరికెళ్ల వీరయ్య దూదిపాల మల్లారెడ్డి దూదిపాల రాజిరెడ్డి జిల్లా యువజన నాయకులు విజయ్ కుమార్ ,కొత్తగట్టు సాయి ,మండల యూత్ నాయకులు బెరుగు తరుణ్ గోపి, సాగర్ ,గజ్జి శంకర్, బుర్ర విజయ్ ,బుర్ర గణేష్, దర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version