ప్రమాదంలో మృతి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి చెక్కు అందజేసిన చిక్కాల.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం దేశాయి పల్లె గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త గట్టు బాల్ రెడ్డి ప్రమాదంలో మరణించగా వారి కుటుంబానికి సెస్ చైర్మన్ కల రామారావు ప్రజా ప్రతినిధులతో కలిసి వారి కుటుంబానికి ప్రమాద బీమా రెండు లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని పార్టీ కార్యకర్తలే బలమని తెలియజేస్తూ ఇట్టి బీమా చెక్కుకు సహకరించిన మంత్రి కేటీ రామారావుకి కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగేవచ్చే ఎన్నికల్లో మన మంత్రి కేటీ రామారావు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మంత్రి కేటీ రామారావు గెలుపుని ఆపలేరని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాజన్న ఎంపీపీ మానస రాజు ఏఎంసి చైర్మన్ సరస్వతి స్థానిక సర్పంచ్ కీర్తి బాలమల్లు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version