ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

వీణవంక, (కరీంనగర్ జిల్లా):

నేటి ధాత్రి:మంగళవారం రోజు వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతూ, భారతదేశ తొలి మహిళా ప్రధానిగా మూడు పర్యాయాలు ప్రధానిగా సేవలు అందించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు వారి హయాంలో గరీబి హటావో నినాదం తో,20 సూత్రాల పథకం పేదలకు అసైన్ భూములు పంపిణీ హరిత విప్లవం పాకిస్తాన్ పై యుద్ధం గెలిచి దేశ ప్రజల మన్ననలు పొందారు వారిని స్ఫూర్తిగా తీసుకునే సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రు.500 /-రూపాయలకే గ్యాస్ సిలిండర్ , రైతులకు సన్న వడ్ల బోనస్, ఇందిర మహా శక్తి కార్యక్రమాలతో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి, ఈదునూరి పైడి కుమార్, గొట్టే రాజయ్య, మద్దుల ప్రశాంత్, దూడపాక రాజ కొమురయ్య, గెల్లు కొమురయ్య, బండారి లక్ష్మణ్, తాళ్ల పెళ్లి సురేష్, కొలిపాక మల్లయ్య, మాజీ సర్పంచ్ లు కర్ర తిరుపతి రెడ్డి, చిన్నాల ఐలయ్య, దాసారపు లక్ష్మణ్, నూతన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కామెడీ శ్రీపతి రెడ్డి, ఎండి రషీద్, మాదాసు సునీల్, నల్లగోని సతీష్,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version