ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో భారత దేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ భారతదేశ తొలి తరం ఏకైక మహిళా ప్రధానిగా ఇందిరగాంధీ పనిచేశారని ఆమె దేశ ప్రధానిగా ఉన్న సమయంలో భారతదేశ ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రపంచంలో భారతదేశాన్నికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని అలాగే భారత దేశ తొలి మహిళప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు చేశారని ఆమె చేసిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ఆమె స్ఫూర్తితో భారతదేశంలో ఇందిరమ్మ పరిపాలన సాగిస్తున్నామని ఇందిరమ్మ పాలనస్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన కొనసాగిస్తున్నారని ఆమె పేద ప్రజలకు అందించిన సంక్షేమాన్ని స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నామని అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇద్దరకి లబ్ధిదారులకు సుమారు 37000. రూపాయల చెక్కును అందించడం జరిగిందని ఆమె భారత దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అభివృద్ధిని దగ్గరికి చేసి భారతీయుల గుండెల్లో పదిలంగా నిలిచిపోయారని ఆ మహానేత ముందుచూపుతోనే దేశంలో చేపట్టిన అనేక సంక్షేమ పథకాల ఫలితంగా దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి జయంతి కార్యక్రమంలో జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ లు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version