మహా అన్నదాన కార్యక్రమం

భీమదేవరపల్లి నేటిదాత్రి:

అన్ని దానాలలో కన్నా అన్నదానం గొప్పదని పొలం ఉమాదేవి అన్నారు.

భీమదేవరపల్లి రెడ్డి సంఘం శ్రీ గణనాయక నవరాత్రి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు మార్పాటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా వచ్చిన పొలం ఉమాదేవి ఈ కార్యక్రమానికి హాజరై అన్నదానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి.రాజేందర్ రెడ్డి మహిపాల్ రెడ్డి.భూపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి మరియు రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

శాంతియుత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలి

ఎలాంటి డీజే లకు అనుమతి లేదు.
గూడూరు సిఐ రాజి రెడ్డి.
కొత్తగూడ, నేటి ధాత్రి.
గణేష్ నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని గూడూరు సీఐ రాజి రెడ్డి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ నిమజ్జనం రోజు రహదారులపై ఎవరికీ ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటూ నిమజ్జనం చేయాలని తెలిపారు. ఈ పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదు. ఎవరైనా డీజేలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈత రాని పిల్లలకు నిమజ్జనం రోజు తీసుకెళ్లకూడదు. కోవిడ్-19 నిబంధనలు ప్రార్థిస్తూ శాంతియుత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా కొత్తగూడ, గంగారం మండల ప్రజలకు తెలియజేశారు.

ఫాతిమానగర్ లో బైకును ఢీకొన్న కారు -ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

కాజీపేట, నేటిధాత్రి:
కాజీపేట పట్టణంలోని ఫాతిమానగర్ జంక్షన్ లో బైకును ఓ కారు వెనుకాల నుంచి వచ్చి ఢీకొన్న సంఘటన బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట నుండి హనుమకొండ కు ఇద్దరు విద్యార్థులు బైకుపై వెళ్తున్నారు. బైకు ఫాతిమానగర్ జంక్షన్ దగ్గరకు రాగానే వెనుక నుండి అతివేగంగా వచ్చిన కారు బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులకు తీవ్రంగా దెబ్బలు తాకాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వెంకట్రాజం కుటుంబానికి అండగా ఉంటా -మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

ధర్మసాగర్,నేటిధాత్రి:
ధర్మసాగర్ మండలం లోని నారాయణగిరి గ్రామంలో ముదిరాజ్ గ్రామ అధ్యక్షులు గొట్టుముక్కల వెంకట్రాజం ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను బుధవారం మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు. నారాయణగిరిలోని వెంకట్రాజం స్వగృహానికి ఆయన కార్యకర్తలతో కలిసి వెళ్లి వెంకట్రాజం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రాజం కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని, ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చునని భరోసాను కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కడియం యువసేన నాయకులు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

గణపతి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

హనుమకొండ, నేటిదాత్రి
హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వల్లాల జగన్ గౌడ్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న మట్టి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడి విశేష దినం నిర్వహించగా ముఖ్య అథితిగా పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని భక్తీ శ్రద్దలతో నిర్వహిస్తున్న వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వల్లాల జగన్ గౌడ్ ని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రముఖులు 303 గవర్నర్ తడక కుమార స్వామి గౌడ్, కోఆర్డినేటర్ జంగా గోపాల్ రెడ్డి, ఆర్ సి, దేశీని లక్ష్మినారాయణ, సైకాలజిస్టు బరుపాటి గోపి, ఎలక్ట్ గవర్నర్ సుధాకర్, పలువురు అభినందించినారు.

తెలంగాణ అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం

నేటిధాత్రి మొగుళ్లపల్లి

తెలంగాణ అమరవీరుల స్మరిస్తూ మండలం లోని ఇసిపేట మొగుళ్లపల్లి కొరికి శాల గ్రామాల్లో సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరులను స్మరిస్తూ సిపిఐ ఎర్ర జెండా ఆవిష్కరించారు నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది అమరులై పోయారని వారి ఆశయాల ను కొనసాగించాలని జిల్లా రైతు సంఘం నాయకులు పెరుమండ్ల రాజయ్య అన్నారు ఈ కార్యక్రమంలో నిమ్మల రాజయ్య కాశి బోయిన రాజయ్య నేరెళ్ల కుమారస్వామి ఎండి నబి సూత్రపు ఆనందం మం దల శ్రీకాంత్ నాంపల్లి కొమురయ్య రాజమల్లు సుధాకర్ గడ్డం రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర గవర్నర్ మాతృమూర్తి కి నివాళులు అర్పించిన : వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)

రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి మరణించడంతో

ఈరోజు గురువారం చెన్నైలోని వారి స్వగృహంలో కృష్ణకుమారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, గవర్నర్ గారిని పరామర్శించిన **TRS రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)* వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి. స్వర్గీయ కృష్ణ కుమారి ఆత్మకు శాంతి చేకూరాలని.వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతున్ని ప్రార్ధించారు..

చిరకాలం నుండి గవర్నర్ కుటుంబంతో గాయత్రి రవికి ఆత్మీయ అనుబంధం ఉన్న నేపథ్యంలో ఈరోజు చెన్నైకి వెళ్లి నివాళులు అర్పించారు …

విద్యుత్ శాఖలో ఒకే ఒక్కడు లైన్ ఇన్స్పెక్టర్

నడి కూడ నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లొ అన్నీతానై అధికభారమై ఇబ్బంది పడుతున్నవైనం.
పట్టించుకోని పై అధికారులు.
మనోవేదన పడుతూ విధులు నిర్వహిస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ మల్లయ్య.
మండలంలో విద్యుత్ శాఖలో ఏఇ , లైన్ ఇన్స్పెక్టర్ , సీనియర్ లైన్ మెన్ , జూనియర్ లైన్ మెన్ , హెల్పర్ లు ఉండాలి కానీ ప్రస్తుతం ఎఇ , మరియు లైన్ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. దీంతో మండల పరిధిలో ఏ ఊర్లో సమస్య వచ్చినా ఎఇ లైన్ ఇన్స్పెక్టర్ కె .మల్లయ్య కే అప్పచెప్పడం వల్ల నానా తంటాలు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. శాఖా పరంగా ఆదాయం సమకూర్చడానికి ఇంటింటికీ తిరిగి బిల్లులు వసూలుచేయాలి , లైన్ ఫాల్ట్ వస్తే కరెంట్ స్తంభాలు ఎక్కాలి , రైతులు పిలిస్తే వెళ్ళాలి, సబ్ స్టేషన్ లో సమస్య ఉంటే సరిచేయాలి ఇవన్నీ కేవలం లైన్ ఇన్స్పెక్టర్ మాత్రమే చేస్తున్నారు. ఇవ్వన్నీ జూనియర్ లైన్ మెన్ విధులు కానీ 57 సంవత్సరాల వయస్సు లో కూడా లైన్ ఇన్స్పెక్టర్ మల్లయ్య భయం భయం గా కరెంట్ పోల్స్ ఎక్కడం , సబ్ స్టేషన్ స్తంభాలు ఎక్కి విధులు నిర్వహిస్తున్నారు. తగిన సిబ్బంది లేక పోవడం వల్ల ఎప్పుడు ఎవరు ఫోన్ చేసిన వెంటనే వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. ఇటు రైతుల నుండి ఒత్తిడి , అటు ఏఇ ఒత్తిడి చేయడం వల్ల మనోవేదన పడుతూ విధులను నిర్వహిస్తున్నాడు. పై అధికారులకు విన్నవించుకున్నా సిబ్బందిని నియమించక పోవడం వల్ల విధుల నిర్వహణ అధిక భారం అవుతుందని మల్లయ్య వాపోతున్నారు. దీనిపై అధికారులు ,స్థానిక ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు స్పందించి విద్యుత్ సేవలను అందించడానికి తగిన సిబ్బందిని నియమించాలని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

రామన్నపేట నేటిదాత్రి యాదాద్రి జిల్లా

రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలో ని గాంధీ విగ్రహం దగ్గర నుండి ర్యాలీ నిర్వహించి యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానిక ఎంపిటిసి వనం హర్షిని చంద్రశేఖర్ జెండా ఎగరడం జరిగింది యువజన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు
ఉద్యోగ నోటిఫికేషన్ లు మరియు నిరుద్యోగ భృతి ఇస్తామని యువతకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేడు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ ఖాళీగా ఉన్నా పోస్టులను భర్తీ చేయకపోవడం వలన రాష్ట్రంలో ఉన్న యువత చాలా నష్టపోతున్నారు అని అన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక దళిత సోదరుల అందరికీ దళితబంథు పథకం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జనం పల్లి ఎంపీటీసీ వేమవరం సుధీర్ బాబు యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోట్ల సాయిబాబా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాల్వేరు అశోక్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గంగాపురం ప్రవీణ్, యువజన కాంగ్రెస్ మాజీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మిరియాల మల్లేష్, పట్టణ అధ్యక్షులు బాసాని రాజు, ఎన్ ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షులు మోటె క్రాంతి,కల్లూరు నరేష్, రేపాక రమేష్, గురజాల మహేష్ రెడ్డి, గోగు హరిప్రసాద్, రేఖ సైదులు,చల్ల సుధీర్, దండుగుల శేఖర్ గజారాజు సాయి కుమార్, నకిరేకంటి నర్సి పైల్వాన్, పరశురాం, మహేశ్వరం అశోక్,రాజు,బైకని నరేష్,సాయితేజ

కాకతీయ యూనివర్శిటీ మొదటి గేటు వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నాయిని రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

నేటిదాత్రి:

కాకతీయ యూనివర్సిటీ వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి జన్మ దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్బంగా వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్ వరంగల్ వెస్ట్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్ మాట్లాడుతూ ఈ
ఎన్ని సమస్యలు, కష్టాలు చుట్టు ముట్టినా
ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి అనునిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతున్న
మన రాజేందర్ రెడ్డి ని కేయూ విద్యార్థులం, యువజన కాంగ్రెస్ మరియు NSUI విద్యార్థి సంఘాలమందరం కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిపించుకుంటామని
మరియు నాయిని అన్నగారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపు కోవాలని ఆ భగవంతున్ని కోరుకుంటుంన్నాను.
ఈ కార్యక్రమంలో..డివిజన్ ప్రెసిడెంట్లు సాయిరాం యాదవ్, శ్రీదర్ యాదవ్, వర్ధన్నపేట నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ వంశి,నెమలి నితిన్ , యూత్ కాంగ్రెస్ నాయకులు అరుణ్, మరియు కాకతీయ యూనివర్శిటీ విద్యార్థులు బన్ని, చరణ్, తరున్ రాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పెద్ది ని పరామర్శించిన నేటిధాత్రి చైర్మన్

తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి స్వర్గీయ పెద్ది రాజిరెడ్డి అనారోగ్యంతో మరణించగా నేటిధాత్రి గ్రూప్స్ చైర్మన్ , సిఈఓ కట్టా రాఘవేంద్ర రావు, నేటిధాత్రి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ కట్టా శివ సుబ్రమణ్యం, తెలంగాణ బ్యూరో బిర్రు కుమారస్వామిలు సోమవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని నల్లబెల్లి మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రాజిరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో రూరల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తడుక రమేష్ గౌడ్, నర్సంపేట ఇంఛార్జి కందుల శ్రీనివాస్ గౌడ్,నల్లబెల్లి మండల రిపోర్టర్ పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్, నెక్కోండ,చెన్నారావుపేట ఖానాపూర్ మండలాల రిపోర్టర్స్ మధు,యాదగిరి,ప్రవీణ్, వినయ్ గౌడ్ లు పాల్గొన్నారు.

వంద పడకల ఆసుపత్రి  దారిలో నిలిచిన వర్షం నీరు

 

  •  నీరును వెంటనే తొలగించాలి సిపిఎం డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి:
నిన్న కొంతసేపు కురిసిన వర్షానికి వంద పడకల ఆసుపత్రి కి పోయే దారిలో చెరువులను తలపించేలా నీరు నిలిచిపోవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సిన బాలింతలు, గర్భిణీలు వారి బంధువులు ఇబ్బందులు పడుతు వేలవల్సి వస్తుందాని కాబట్టి వెంటనే వర్షం నీరు తొలగించి రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు.సిపిఎం బృందం వర్షం నీరు నిలిచిన ఉన్న పరిస్థితిని పరిశీలించి అందులో దిగి నిరసన వ్యక్తం చేసి పేషెంట్స్ బంధువులను ఆసుపత్రి కి తరలించడం ఆస్పత్రిలో ఉన్న వారిని బయటికి తరలించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొద్దిపాటి వర్షానికి నీళ్లు నిలవడం తో పేషెంట్లు హాస్పటల్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం నీరు చెరువులకు పోయే దారిని కాంట్రాక్టర్మూ సివేయడంతో ఈ సమస్య ఉత్పన్నం అయిందని ఆయన పేర్కొన్నారు. వర్షంనిరు చెరువు కు వెళ్లే దారిలో అడ్డుగా కాంట్రాక్టర్ల మట్టిపొయడంతొ నిరు నిలిసిపొయిందాని కావున మట్టిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నీరు నిలవడానికి కారణమైన కాంట్రాక్టర్ పై సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.వర్షం నిరు పై నుండి వస్తున్న వాటర్ పోవడానికి కాలువను ఏర్పాటు చేయాలని అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆసుపత్రికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోవడానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. ఈ సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి జోక్యం చేసుకోవాలని పరిష్కారించాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారం కాకుంటే రాబోయే రోజులొ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెలిశెట్టి రాజయ్య, పొలం రాజేందర్, బొట్ల చక్రపాణి ,నాయకులు రజాక్ విరాట్ శ్రీ రాములు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కోతకు గురవుతున్న సిసి రోడ్డు

  • ఇంత నిర్లక్ష్యం ఎందుకు స్థానిక ప్రజలు

    దామెర,నేటిధాత్రి:

    మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డబుల్ రోడ్డు సైడ్ డ్రైనేజీ లేక ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరద రోడ్డు క్రింది భాగం నుండి వెళుతుండగా క్రింది భాగం మొత్తం కోతకు గురై రోడ్డు కూలిపోయే ప్రమాదముందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా కాంట్రాక్టర్ మేలుకొని సైడ్ డ్రైనేజి ఏర్పాటు చేయాలని ,. సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

రైతు కుటుంబాలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం

  •  రూ. కోటి 10 లక్షల విలువైన రైతుబీమా చెక్కుల వితరణ

  •  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట, నేటిధాత్రి :

దేశానికి అన్నం పెట్టే రైతు ఆకాల మ‌ర‌ణం పొందితే వారిపై ఆధార ప‌డ్డ‌ కుటుంబం రోడ్డున ప‌డుతుందని ,రైతు బ‌తికున్న‌ప్పుడు ఎంత గౌరవంగా బ‌తికారో య‌జ‌మాని చ‌నిపోయాక కూడా అంతే గౌర‌వంగా బ‌త‌కాల‌నే ఉద్దేశ్యంతో రూ.5 ల‌క్ష‌ల‌ ప్ర‌మాద బీమా ను కుటుంబాలకు అందిస్తూ యావ‌త్ ప్ర‌పంచం మెచ్చే విధంగా అలాగే ఐక్య‌రాజ్య‌స‌మితి అభినందించే విధంగా ప‌థ‌కం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉన్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. నియోజవర్గంలోని పలు మండలాలలోని 22 మంది రైతులు వివిధ కార‌ణాలతో మృతి చెందగా వారి కుటుంబాలకు ఒక్కొక్క‌రికి టీ 5 ల‌క్ష‌ల చొప్పున రూ. కోటి 10 ల‌క్ష‌ల విలువైన చెక్కుల‌ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ ఇప్పటివ‌ర‌కు న‌ర్సంపేట నియోజ‌కవ‌ర్గ వ్యాప్తంగా దాదాపు 442 మంది రైతుల‌ కుటుంబాలకు రైతుబీమా పథకం ద్వారా రూ. 22 కోట్ల 10 లక్షలు, అదేవిధంగా 66531 మంది రైతులకు రైతుబందు పథకం ద్వారా 57 కోట్ల 18 లక్షల రూపాయల నగదును అందజేసినట్లు తెలిపారు. రైతుబీమా ప‌థ‌కం వ‌ల‌న యావ‌త్తు తెలంగాణ రైతులు భ‌రోసాగా బ్ర‌తుకుతున్నార ని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాస్ రావు, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, అర్ ఎస్ ఎస్ డైరెక్టర్లు, రైతుబందు కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసిలు, సర్పంచ్లు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

*హూజురాబాద్ టికేట్ నాకే* _యూత్ ఓక్కోకరికి 3000- 5000 ఇస్తా

ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో, నేటిధాత్రి

 

 కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కజిన్ బ్రదర్ పాడి కౌశిక్ రెడ్డి ఆడియో కలకలం సృష్టిస్తోంది.

 

టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని యూత్‌ను మొబులైజ్ చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఓ వైపున తాను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్తూ సీక్రెట్‌గా టీఆర్ఎస్ అభ్యర్థిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్టుగా ఈ ఆడియో ద్వారా స్పష్టం అవుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పాడి కౌశిక్ రెడ్డి ఆడియో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
కమలాపూర్ మండలం మాదన్న పేటకు చెందిన ఓ యువకునితో మాట్లాడిన సంభాషణలో యూత్‌ను తనకు అనుకూలంగా మొబులైజ్ చేసి, అవసరమైతే ఓక్కోక్కరికి రూ. 3 వేల నుండి రూ. 5 వేల వరకు ఇవ్వాలని కూడా కౌశిక్ రెడ్డి రాజేందర్ అనే వ్యక్తికి సూచించడం గమనార్హం. టీఆర్ఎస్ అభ్యర్థిగా తాను బరిలో నిలుస్తున్నానని కౌశిక్ రేడ్డి చెబుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డితో టచ్‌లో ఉండాలని కూడా కౌశిక్ రెడ్డి సూచించడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో గురించే టీఆర్ఎస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి.

కేయూ ఇంజనీరింగ్ మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

కేయూ క్యాంపస్, నేటిదాత్రి
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న మూడవ సంవత్సరం మొదటి సెమిస్టర్ ఇంజనీరింగ్ మిగతా పరీక్షలను నిరవధికంగా వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి మల్లా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 9, 12, 14, 16 వ తేదీల్లో జరగాల్సిన మిగతా ఇంజనీరింగ్ పరీక్షలను వాయిదా వేసినట్లు వారు పేర్కొన్నారు. పరీక్షలు మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని, షెడ్యూల్ను వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు. హాస్టల్లో ఉండే వసతి తీసుకుంటున్న విద్యార్థులలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య అధికారుల నేతృత్వంలో అధికారులు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు సోమవారం నుంచి జరగాల్సిన మిగతా పరీక్షలు సైతం వాయిదా వేశారు.

కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో కరోనా కలకలం-శుక్రవారం పరీక్ష వాయిదా

నేటిదాత్ర కేయూ:
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు జులై 5వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ హాస్టల్లో దాదాపు 200 మంది విద్యార్థులు వసతి తీసుకొని పరీక్షలు రాస్తున్నారు, వారిలో ఒకరు అస్వస్థతకు గురి కాగా, టెస్ట్ చేస్తే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కోవిద్ పాజిటివ్ వచ్చిన విద్యార్థిని ఇంటికి పంపించి, హాస్టల్ డైరెక్టర్ మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు అందరూ పరీక్షలను పోస్ట్పోన్ చేయాల్సిందిగా అధికారులను కోరగా శుక్రవారం జరగబోయే బీటెక్ మూడవ సంవత్సరం మొదటి సెమిస్టర్ మూడో పేపర్ పరీక్ష వాయిదా వేశారు. మిగతా పరీక్షలను సోమవారం నుండి యధావిధిగా కొనసాగించబడ్డాయనీ వాయిదా వేసిన పరీక్షను ఎప్పుడు నిర్వహించేది తర్వాత షెడ్యూల్ చేస్తామని పరీక్షల నియంత్రణ అధికారి మరియు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య మల్లారెడ్డి అదనపు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సురేఖ తెలిపారు. రోజు పరీక్ష ప్రాంగణములో మరియు వసతిగృహాలలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయాలని, బీటెక్ పరీక్షలను ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో నిర్వహించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. గత మూడు రోజుల క్రితం జెఎన్టి యు మరియు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పరీక్షలను వాయిదా వేయాలని ఆన్లైన్లో బీటెక్ డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరడం జరిగింది.
ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, జాతీయ విద్యా సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీస్, అటానమస్ కళాశాలలు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు, కానీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఆఫ్లైన్ విధానానికి మొగ్గు చూపడం వలన విద్యార్థులు కరోనా బారినపడి ప్రాణ నష్టం జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని, టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యార్థులకు పరీక్షలు ఆన్లైన్లో పెట్టాలని విద్యావేత్తలు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో కరోనా కలకలం

*కేయూ క్యాంపస్, నేటిదాత్రి*
కాకతీయ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ హాస్టల్లో దాదాపు 200 మంది విద్యార్థులు వసతి తీసుకొని పరీక్షలు రాస్తున్నారు, వారిలో ఒకరు అస్వస్థతకు గురి కాగా టెస్ట్ చేస్తే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కోవిద్ పాజిటివ్ వచ్చిన విద్యార్థిని ఇంటికి పంపించి, హాస్టల్ డైరెక్టర్ మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు అందరూ పరీక్షలను పోస్ట్పోన్ చేయాల్సిందిగా అధికారులను కోరగా వారు నిరాకరించి, పరీక్షలను యధావిధిగా నిర్వహిస్తామన్నారు.

అక్రమంగా నడిపిస్తున్న నారాయణ జూనియర్ కళాశాల సీజ్

అక్రమంగా నడిపిస్తున్న నారాయణ జూనియర్ కళాశాలకు షోకాజ్ నోటిసులు పంపి,కళాశాలను సీజ్ చేసిన డి.ఐ.ఈ.ఒ

నేటి ధాత్రి* హన్మకొండ లోని పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం లో గల భవనం కిరాయికి తీసుకుని అక్రమంగా నారాయణ జూనియర్ కాలేజి పేరుతో నడిపిస్తున్నారు.ఈ కళాశాల పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎబివిపి కార్యకర్తలు వరంగల్ జిల్లా డి.ఐ.ఈ.ఒ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ రోజు నారాయణ జూనియర్ కాలేజి యాజమాన్యం కి షోకాజ్ నోటిసులు జారి చేసారు. వరంగల్ అర్బన్ జిల్లా డి.ఈ.ఓ మరియు డి.ఐ.ఈ.ఓ ఆధ్వర్యంలో కళాశాల ను సీజ్ చేసారు.ఈ సందర్భంగా ఎబివిపి తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేణు మాట్లాడుతూ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఎబివిపి చూస్తూ ఉండదు. నిరంతరం విద్యార్థుల సమస్యల పై కృషి చేస్తాం.గత వారం రోజులుగా ఎబివిపి కార్యకర్తలు కార్పొరేట్ కాలేజి అయిన నారాయణ జూనియర్ కాలేజికి ధీటుగా కృషి చేసారు. దాదాపు 100 మంది విద్యార్థుల దగ్గర లక్ష రూపాయల వరకు ఫీజు వసూలు చేసారు. వారి డబ్బుని వారికి తిరిగి చెల్లించాలని నారాయణ కాలేజి యాజమాన్యాన్ని డిమాండ్ చేసారు.విద్యార్థులకి మోసం చేస్తున్న ఇలాంటి కార్పొరేట్ కాలేజి లకి ఇది ఒక హెచ్చరిక.ఇకనైనా డి.ఐ.ఈ.ఓ గారు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని డిమాండ్ చేసారు. కార్యకర్తలు పాషా,బలరాం, శ్రీ హరి పాల్గొన్నారు.

*తహసీల్ కు లంచంగా తాలిబోట్టు*

రాజన్న సిరిసిల్ల జిల్లా / *నేటి ధాత్రి*

*తాళిబొట్టు తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని మహిళ నిరసన*

రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం మంగ కు చెందిన సర్వే నెంబర్ 130/14 లో గలా 2 ఎకరాల భూమిని తన భర్త రాజేశం మూడు సంవత్సరాల క్రితం చనిపోగానే వేరే వాళ్ళకి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పట్టా చేసరని న భూమి నాకు పట్టా చేయాలని మూడు సంవత్సరాలుగా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని
ఈ రోజు తన భర్త ఎలాగో లేడు అని తన తాళిబొట్టు తీసి ఆఫీస్ గెట్ కి వేలాడదీసి ఇ తాళిబొట్టును లంచంగా తీసుకొని న భూమి నాకు పట్టా చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.బాధిత మహిళ ఉద్యోగ రీత్యా మెటపల్లి లో పని చేసుకుంటూ ఉండగా వేరే వళ్లు తన భూమిని మొక ఎంక్వైరీ చెపిచ్చుకొని పట్టి చేసుకున్నారని దానికి అధికారులు కూడా సహకరించారని ఆవేదన వ్యక్తం చేసింది తనకు భర్త లేడాని కనీసం తనకు ఆధారమైన ఇట్టి భూమినైన ఇప్పించాలని అధికారులను వేడుకుంటుంది……

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version