కాటారం, నేటి ధాత్రి
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుద్ధ జయంతి వేడుకలు కాటారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకుడు పీక కిరణ్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్ధుడు గొప్ప దార్శనీయకుడని, ఆయన చూపిన మార్గం ముందుకు సాగాలని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ఒక్క మాటతో 1956 విజయదశమి రోజున 5 లక్షల మంది, పరిస్థితి రోజు మూడు లక్షల మంది బౌద్ధమతంలోకి మారారని తెలిపారు. భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ను డాక్టర్ అంబేద్కర్ బౌద్ధం నుండే సేకరించినట్లు చెప్తాడని ఈ సందర్భంగా తెలిపారు. బౌద్ధం శాంతిని , అహింసను బోధిస్తుందని అందుకే ప్రపంచానికి భారతదేశం శాంతిని చెబుతుందని పీక కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు అక్కల బాపు యాదవ్, పోచయ్య, ఉమేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు