వడ్ల కొనుగోలు కేంద్రాలలో అవకతవకలకి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన డాక్టర్ రాజా రమేష్ బాబు

జైపూర్, నేటి ధాత్రి:

చెన్నూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ ఆదేశాల మేరకు చెన్నూర్ నియోజకవర్గం లోని దుబ్బపల్లి, పొన్నారం, దుగ్నేపల్లి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తూ దుగ్నేపల్లి దగ్గర కాంటలోపం వల్ల ప్రతి బస్తాకు కేజీ నుండి కేజీన్నర తూకం వేసి రైతులను మోసం చేస్తున్నారు. పోన్నారం దగ్గర రైతుల వడ్లుకొని రసీదు ఇచ్చే సమయంలో వడ్లకు సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు జత చేసి రైతుల వడ్లని వారికి కొంత భాగం కేటాయిస్తూ మోసం చేయడం అలాగే దుబ్బపల్లి లో ప్రతి లారీకి 8 క్వింటాళ్ల వడ్లను తక్కువ వచ్చినవి అనే సాకుతో అక్కడున్నటువంటి రైతులను మోసం చేయడం జరుగుతుంది. ఈ మూడు వడ్ల కొనుగోలు సెంటర్లో జరుగుతున్నటువంటి అవినీతి ఆధారాలను చూపిస్తూ ఇట్టి చర్యలకు పాల్పడిన కాంగ్రెస్ నాయకుల పై అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అలాగే చెన్నూరు నియోజకవర్గం లోని ప్రతి ఒక్క వడ్ల కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జేసీ కి వినతి పత్రం అందజేసిన చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు. ఎంపీపీ మంత్రి బాపు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రెడ్డి,మాజీ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు సమ్మి రెడ్డి, సోమన పల్లి ఎంపీటీసీ తుమ్మల తిరుపతి రెడ్డి, గోగుల రవీందర్ రెడ్డి, కిరణ్, అర్జున్ రెడ్డి, రవీందర్ గౌడ్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version