ఝరాసంగం సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘన విజయం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ వినోద బాలరాజ్ మరియు 6 వార్డులలో విజయం సాధించింది. సర్పంచ్ అభ్యర్థి వినోద బాలరాజ్ 4 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ 6 వార్డులకు పరిమితమైంది గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఆయన గ్రామ ప్రజలకు కార్యకర్తలకు కృతజ్ఞతలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
కాంగ్రెస్ పార్టీ తన అంచు కోట అని 60 సంవత్సరాలుగా పరిపాలించిన ఝరాసంగం గ్రామాన్ని బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది సర్పంచ్ అభ్యర్థి వినోద బాలరాజ్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గ్రామ మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ టౌన్
మాజీ ఉప్పసర్పంచ్ సంగన్న ప్రెసిడెంట్ ఎజాస్ బాబా నాగన్న పటేల్ సజ్జన్ నాగేశ్వరరావు మరియు షేక్ రబ్బానికి కార్యకర్తలకు సహాయం చేసిన గ్రామ ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు,
