సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ విజయం సాధించాలి..

సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ విజయం సాధించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్ పట్టణంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్,ఎన్నికల ఇంచార్జీ దేవీప్రసాద్,మాజి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
అనంతరం వివిధ వార్డ్ లకు ముఖ్య నాయకులను ఇంచార్జి లుగా ప్రకటించి,పార్టీ మున్సిపల్ అభ్యర్థులను ఇంచార్జిలకు పరిచయం చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే ,నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల బానిస పాలనకు చరమగీతం పాడి తెలంగాణకు కె.సి.ఆర్ విముక్తి కలిగించారని కానీ నేడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఆంధ్ర పాలకుల తొత్తుగా మారి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు అని ఆరోపించారు.మున్సిపల్ ఎన్నికల్లో కె.సి.ఆర్ గారి సంక్షేమ పథకాలు,మనం చేసిన అభివృద్ధి వివరించి ఓట్లు అభ్యర్థించాలని పిలుపునిచ్చారు.
పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి ఐకమత్యంగా పనిచేసి గెలిపించుకోవాలని టికెట్ రాని వారు నిరాశ చెందవద్దని పార్టీ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని బరోసా ఇచ్చారు 420హామీలు,6గ్యారంటీలు అమలు చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మహిళలకు 2500,ఆసరా పింఛన్లు 4000,కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా విద్యార్థినులకు స్కూటీలు ధాన్యానికి బోనస్ గ్యాస్ సబ్సిడీ రైతులకు రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు బీమా వంటి పథకాలు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు మున్సిపల్ ఎన్నికల విజయం కె.సి.ఆర్ గారికి కానుక కావాలి.సమిష్టిగా పనిచేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.టిక్కెట్లు రాని వాళ్ళు సమర్థులు కారని పార్టీ అభిప్రాయం కాదని వారికి కూడా పార్టీ తగిన రీతిలో గౌరవం ,ప్రాధాన్యత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, ఆర్ సుభాష్ మాజీ కౌన్సిలర్స్, మాజి సర్పంచ్ లు , ఎంపీటీసీ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version