దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభాలకు తలొగద్దు
అవగాహన కార్యక్రమంలో ఎస్సై రణధీర్
నర్సంపేట,నేటిధాత్రి:
గ్రామాల్లో రోజురోజుకు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రావుల రణధీర్ తెలిపారు.దుగ్గొండి మండల కేంద్రంలో ప్రాధమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం ఆవరణలో గ్రామస్తులు,రైతులతో సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే గత కొన్ని రోజులుగా జరుగుతున్న దొంగ తనాలు,చైన్ స్నాచింగ్,పట్ల వివరించారు.అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రజలు,ఓటర్లు పాటించ వలసిన జాగ్రత్తల గురుంచి క్షుణ్ణంగా వివరించారు.
మండలంలో ఎవరైనా అనుమానిత వ్యకలు కనపడితే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని కోరారు.రాబోయే ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనవద్దని ఎస్సై రణధీర్ తెలిపారు.