బసవేశ్వరుని విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం.

బసవేశ్వరుని విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం.

◆ రూపుతీర్చిదిద్దిన శిల్పి బస్వరాజ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి చౌరస్తాలోని 65వ జాతీయ రహదా రిపై ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వరుడి 12 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కర ణకు సిద్ధమైంది. న్యాల్కల్కు చెందిన ప్రముఖ శిల్పి డాక్టర్ హోతి బస్వరాజు చేత రూపుదిద్దుకున్న ఈ విగ్రహాన్ని ఈనెల 23న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో జహీరాబాద్ కు సీఎం చేరుకుంటారు. హుగ్గెల్లి చౌరస్తాకు వెళ్లి బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించి భక్తులకు అంకితం చేయనున్నారు. అనంతరమే ఇతర కార్యక్రమాల్లో సీఎం పాలుపం చుకుంటారు. కాగా ఈ బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని రూపొందించేందుకు శిల్పి బస్వరాజ్ ఎంతో శ్రమించారు. రెండు టన్నుల పంచలోహాన్ని ఉపయోగించి 12 అడుగుల ఎత్తులో రూపొందించారు. 25 మంది నైపుణ్యం గల పనివారితో ఆరు నెలల సమయంలో శిల్పాని తీర్చిదిద్దడం జరిగిందని శిల్పి డాక్టర్ హోతి బస్వరాజు తెలిపారు. తన సొంత తాలూకా అయిన జహీరాబాద్లో తాను రూపొందించిన ఈ విశ్వగురు బసవేశ్వర కాంస్య శిల్పాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version