పరిసరాల పరిశుభ్రత పై అవగాహనా
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి ఆదేశాలతో డాక్టర్ అమరేందర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్న జిల్లా క్షయ అధికారి డాక్టర్ సుధాకర్ రెడ్డి ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీరాములు మరియు జిల్లా మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ వాణిశ్రీ సందర్శించి పరిసరాల పరిశుభ్రత పై అవగాహనా కల్పించారు జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లల డ్రాప్ అవుట్ వెరిఫికేషన్ గ్రామంలో ఆంటీ లార్వా రిమూవ్ శానిటేషన్ పరిసరాల పరిశుభ్రత గవర్నమెంట్ డెలివరీ టీబి కేసెస్ ఫాలో ఆఫ్ . ఫీవర్ కి ఎస్ ఎస్ వెరిఫికేషన్ చేయడంతో పాటు క్యాంపును సందర్శించారు మెడికల్ క్యాంపులో 82 మందికి ఓపి చూడగా 12 మంది రక్త నమూనాల సేకరించి అందరికీ ఆరోగ్య విద్యా బోధన చేయడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తూ మందులు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బంది. గ్రేస్మని శ్రీనివాస్ రమ స్వప్న సంధ్య విజయ పాల్గొన్నారు