hanamkondalo vijayashanti arrest, హన్మకొండలో విజయశాంతి అరెస్ట్‌

హన్మకొండలో విజయశాంతి అరెస్ట్‌

ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ముట్టడిలో పాల్గొనేందుకు వచ్చిన టీపీసీసీసి చైర్‌పర్సన్‌ విజయశాంతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ఏకశిలా పార్కు నుంచి కాంగ్రెస్‌ ర్యాలీ మొదలు కాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న విజయశాంతిని అరెస్ట్‌చేసి హసన్‌పర్తి పోలీసుస్టేషన్‌కు తరలించారు. హన్మకొండ, సుబేదారి పోలీస్‌స్టేషన్‌లకు తరలించే వీలు ఉన్న పోలీసులు ముందు జాగ్రత్తగా ఇక్కడకు తరలించినట్లు తెలిసింది. నగరానికి దూరంగా ఉంటే ఆందోళన తగ్గుతుందని పోలీసులు ఇలా వ్యవహరించినట్లు తెలిసింది. కాగా పోలీసుల తీరుపై రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

kishanreddyki matruviyugam, కిషన్‌రెడ్డికి మాతవియోగం

కిషన్‌రెడ్డికి మాతవియోగం

బీజేపీ నేత కిషన్‌రెడ్డి తల్లి గంగాపురం అండాలమ్మ (80) కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత అండాలమ్మ తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం ఆమె స్వస్థలం కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అండాలమ్మ మతిపట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. కిషన్‌రెడ్డి తల్లి మృతిచెందిన విషయం తెలిసిన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆమె మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపి, కిషన్‌రెడ్డిని పరామర్శించారు.

ambedkar vigrahanni punaprathishitinchali, అంబేద్కర్‌ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలి

అంబేద్కర్‌ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని పంజాగుట్ట సెంటర్‌లో పున:ప్రతిష్టించాలని, లేకుంటే అమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మహాసేన జాతీయ అధ్యక్షుడు కొంగర అనిల్‌కుమార్‌ తెలిపారు. గురువారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చడం, ఎస్సీ, ఎస్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని, ప్రభుత్వం వెంటనే అంబేద్కర్‌ విగ్రహన్ని పున:ప్రతిష్టించాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలను ఏకం కావాలని, ఏకమైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని అన్నారు. ఈ సమావేశంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎండి.నయిం, జాతీయ నాయకులు చిన్నపెల్లి శ్రీనివాస్‌, వస్కుల ఉదయ్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు ఫమిజుల్లా, బిసి సెల్‌ సెక్రటరీ లెనిన్‌, తూర్పు ఇన్‌చార్జ్‌ ప్రసన్నకుమార్‌, క్రాంతి, జిల్లా డైరెక్టర్‌ వజిద్‌ అలీ, జిల్లా నాయకులు ఎండి.సుబాని, రాష్ట్ర నాయకులు రాబర్ట్‌ విల్సన్‌, రవీందర్‌, జెసి రవీందర్‌, సయిద్‌, అంబాల మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

kaleshwaram project wet run vijayavantham, కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం

కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్క తం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ పూజలు నిర్వహించి స్విచాన్‌ చేసి వెట్‌ రన్‌ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్‌పూల్‌ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్‌ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి. అక్కడి నుంచి గోదావరి జలాలు లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌కు చేరనున్నాయి. లక్ష్మీపూర్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు మిడ్‌మానేరుకు చేరుకోనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్‌ మొదలు అనేక జిల్లాల్లో దాదాపు 151టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించి నిల్వ చేసేందుకు మొత్తం 82మోటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కనిష్టంగా 2.66మెగావాట్ల నుండి మొదలు 26, 40, 106…ఇలా ఆసియాలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న..బాహుబలిగా పిలిచే 139మెగావాట్ల మోటరును కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. వీటి ఏర్పాట్లు వివిధ దశల్లో ఉన్నాయి. నందిమేడారం పంపుహౌజ్‌లో 124.4మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను అమరుస్తున్నారు. ఏడింటికిగాను నాలుగు డ్రైరన్‌ పూర్తి చేసుకొని, వెట్‌ రన్‌ కు సిద్ధంగా ఉన్నాయి.

zptc abyarthiga nomination dakalu, జడ్పీటిసి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు

జడ్పీటిసి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు

వీణవంక మండలకేంద్రంలో జడ్పీటిసిగా రామకష్ణపూర్‌ సర్పంచ్‌ మ్యాకల సమ్మిరెడ్డి సతీమణి మ్యాకల అనిత నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వీణవంక సర్పంచ్‌ నీల కుమార్‌, ఉపసర్పంచ్‌ భాను, సిద్దెపెల్లి మహిపాల్‌రెడ్డి అభ్యర్థిని ప్రతిపాదించారు.

chinna nagaramlo health camp, చిన్ననాగారంలో హెల్త్‌క్యాంప్‌

చిన్ననాగారంలో హెల్త్‌క్యాంప్‌

నూగూరు వెంకటాపురం మండలంలోని చిన్న నాగారం గ్రామంలో బుధవారం హెల్త్‌క్యాంప్‌ నిర్వహించారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో బిపి, షుగర్‌ తదితర వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రజలందరికీ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ హెల్త్‌ క్యాంప్‌లో డాక్టర్‌ రాజమౌళి, సిబ్బంది వై.సరోజన, రాఘవులు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

inter board ethesthara…?, ఇంటర్‌ బోర్డు ఎత్తేస్తారా…?

ఇంటర్‌ బోర్డు ఎత్తేస్తారా…?

ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం…విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో బోర్డు వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీరియస్‌ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఇంటర్‌ ఫలితాల్లో దొర్లిన తప్పులపై ఆందోళన కొనసాగుతుండగా ఫెయిల్‌ అయ్యామనే ఆందోళనతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి బుధవారం తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అసలు ఫలితాల ప్రకటనలో తప్పులు ఎలా దొర్లాయని ప్రశ్నించారు. పేపర్లు దిద్దడంలో ఏజెన్సీ గందరగోళానికి పాల్పడిందా…అసలు లోపం ఎక్కడుందని ఆయన ఆరాతీసినట్లు సమాచారం. విద్యాశాఖపై సీఎం సమీక్ష అనంతరం ఇంటర్‌ బోర్డు ఎత్తివేయనున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా జరుగుతోంది. ఇంటర్‌ పరీక్ష ఫలితాలు, గందరగోళం తరువాత పరిణామాలపై సీఎం కేసిఆర్‌ సీరియస్‌ అయ్యారని ఇంటర్‌ బోర్డును ఎత్తివేసి 12వ తరగతి వరకు ఒకే బోర్డును ఏర్పాటు చేయనున్నారని ఊహగానాలు బయలుదేరాయి. తెలంగాణ స్టేట్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు పేరుతో ఏర్పాటు చేయనున్నారని అంటున్నారు.

balaji techno school nirvakam, బాలాజీ టెక్నో స్కూల్‌ నిర్వాకం

బాలాజీ టెక్నో స్కూల్‌ నిర్వాకం

నర్సంపేట లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్‌లో వేసవి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు బుధవారం పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆర్జేడీ, ఇంచార్జి డీఈవో టీ.రాజీవ్‌, ఎంఈఓ దేవా తదితరులు పాల్గొన్నారు. బాలాజీ టెక్నో స్కూల్‌ యాజమాన్యం అధికారులు తనిఖీలు నిర్వహించేందుకు వస్తున్న విషయాన్ని తెలుసుకుని విద్యార్థులను దాచేశారు. తరగతి గదుల్లో విద్యార్థుల పుస్తకాలు లభ్యం కాగా, అందులో కొద్దిరోజులుగా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయుల సంతకాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అంతకు ముందురోజు తరగతుల నిర్వహణపై వచ్చిన సమాచారంతో సీఆర్పీ శ్రీనివాస్‌ అక్కడికి వెళ్లి ఫొటోలు తీసి అధికారులకు చెప్పాడు. ఇంతలోనే బాలాజీ టెక్నో విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ ఏ.రాజేంద్రప్రసాద్‌రెడ్డి చేరుకొని అతని వద్ద గల సెల్‌ఫోన్‌ లాక్కొని నానా దుర్భాషలు ఆడుతూ బెదిరించి వెళ్లగొట్టాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వారి ఆదేశానుసారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విధినిర్వహణకు అడ్డుపడి ఆధారాలు కలిగిన సెల్‌ఫోన్‌ లాక్కొన్నాడంటూ శ్రీనివాస్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో పాఠశాల నిర్వహించడంతోపాటు సీఆర్పీ శ్రీనివాస్‌పై దౌర్జన్యానికి దిగిన సంఘటనపై ఆర్జేడీ రాజీవ్‌ జిల్లా కలెక్టర్‌కు నివేదించారు.

ఆత్మహత్యలు చేసుకోవద్దు: కేసిఆర్‌

ఆత్మహత్యలు చేసుకోవద్దు: కేసిఆర్‌

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ కోరుకుంటే గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యాసంవత్సరం కోల్పోకుండా అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌, అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్థన్‌రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలను అత్యంత దురదష్టకరమైన సంఘటనలుగా సిఎం పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో ఫెయిలయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సిఎం విజ్ఞప్తి చేశారు.

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ బి.జనార్థన్‌రెడ్డి, బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ కార్యదర్శి డాక్టర్‌ ఎ.అశోక్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సిఎంఓ కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల పేపర్ల వాల్యువేషన్‌, ఫలితాల వెల్లడి, అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఈ ఏడాది 9.74లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాశారని, వారిలో 3.28లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారని, మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల తమకు రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చి, ఫెయిలయ్యామని కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారని తెలిపారు. వారి అనుమానాలు నివత్తి చేయడానికి ఫెయిలయిన విద్యార్థులకు ఉచితంగా రీ-వెరిఫికేషన్‌ చేయించుకునే వెసులుబాటు కల్పించారు. విద్యార్థి ఏ సబ్జెక్టులోనైతే ఫెయిలయ్యారో ఆ పేపర్‌ను రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ చేయాలి. పాసయిన విద్యార్థులకు కూడా రీ-వెరిఫికేషన్‌ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని రీ-వెరిఫికేషన్‌ చేయాలి. రీ- వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించాలి. నీట్‌, జెఇఇ లాంటి దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలయింత త్వరగా అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలి’ అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘ఇంటర్మీడియట్‌తోపాటు ఎంసెట్‌ తదితర ప్రవేశార్హత పరీక్షల విషయంలో కూడా ప్రతీసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, ఆ పద్ధతులను తెలంగాణ రాష్ట్రంలో అమలుచేయాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలనొప్పులు నివారించడం అసాధ్యమేదీ కాదు’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇంటర్మీయట్‌ విద్యార్థుల డాటా ప్రాసెస్‌, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్‌సోర్సింగ్‌ ఏజన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగారు. ఇ-ప్రొక్యూర్‌మెంటు ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోడ్‌ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ మదించిందని వారు వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు. ‘ఇంటర్మీడియట్‌లో ఫెయిలయ్యామనే బాధతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ వార్తలు చూసి నేను చాలా బాధ పడ్డాను. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదష్టకరం. ఇంటర్మీడియట్‌ చదువు ఒక్కటే జీవితం కాదు. పరీక్షల్లో ఫెయిలయితే జీవితంలో ఫెయిలయినట్లు కాదు. ప్రాణం చాలా ముఖ్యమైనది. పరీక్షల్లో ఫెయిలయినప్పటికీ చదువులో, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. అభిరుచి, సామర్థ్యాన్ని బట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, వత్తులను ఎంచుకుని రాణించాలి. జీవితంలో నిలబడాలి. పిల్లలు ధైర్యంగా ఉండాలి. మీరు చనిపోతే తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుతుంది. వారికది ఎన్నటికీ తీరని లోటు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్న’ అని ముఖ్యమంత్రి అన్నారు.

endalo jagratha, ఎండలో జాగ్రత్త

ఎండలో జాగ్రత్త

జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్‌ ప్రకటన జారి చేసారు. మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. జిల్లాలో ఎండ వేడిమి అధికంగా ఉండడంతో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బకు వద్ధులు, గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఎక్కువగా గురి అవుతున్నారని పేర్కొన్నారు. అలాంటి వారు ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఇంటి నుంచి బయటికి రావొద్దని సూచించారు. తప్పనిసరి పరిస్థితులలో రావాల్సివస్తే రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆరుబయట పనిచేసేవారు ఎండ తీవ్రత నుంచి తగిన రక్షణ పొందాలని, పలుచని మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ద్రావణాలను ఎక్కువగా తీసుకుంటే వడదెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు. విపరీతమైన తలనొప్పి, తల తిరగడం, తీవ్రంగా జ్వరం కల్గి ఉండడం, మగత నిద్ర, కలవరింతలు, ఫిట్స్‌, పాక్షికంగా అపస్మారక స్థితిలో ఉంటే వడదెబ్బ లక్షణాలుగా గుర్తించి బాధితుడిని డాక్టరుకు చూపించాలన్నారు. వెంటనే ప్రథమ చికిత్స అందజేయాలని తెలిపారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చడం, శరీర ఉష్ణోగ్రత సాధారణస్థాయికి వచ్చే వరకు చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవటంతోపాటు ఉప్పు కలిపిన మజ్జిగ, చిటికెడు ఉప్పు కల్గిన గ్లూకోజు ద్రావణం, ఒఆర్‌ఎస్‌ ద్రావణం తాగించాలని పేర్కొన్నారు. ఎండలకు బయటికి వచ్చేటప్పుడు మాత్రం చల్లని మజ్జిగ, నిమ్మరసం, మంచినీరు తాగాలని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు మాత్రం అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి వైద్యం తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వడదెబ్బ తగిలిన వ్యక్తులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని అన్నారు. వడదెబ్బకు గురైన వ్యక్తులు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే మెరుగైన చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని, స్వచ్చంద సంస్థలు ఎండ తీవ్రతతో కలిగే నష్టాలను ప్రచారం చేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 108వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు.

వడదెబ్బ లక్షణాలు

1. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే సమయంలో ప్రజలు బయటకు వెళ్లడం, పనిచేయడం మంచిది కాదని, చల్లని నీరు ఎక్కువగా తీసు కోవాలని తెలిపారు.

2. ప్రజలు తప్పని పరిస్థితులలో ఎండలోనికి వెళ్లవలసి వస్తే గొడుగు, తలపై టోపీ, కళ్లకు కూలింగ్‌ అద్దాలు ఉపయోగించాలని చెప్పారు.

3. కూలి పనులకు వెళ్లేవారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కాకుండా తక్కువ ఎండ ఉన్నపుడు పనులు చేసుకుంటే మంచిదని సూచించారు.

4. ఎండ వేడిమికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉంటే తక్షణమే డాక్టర్లను సంప్రదించడం మంచిదని,

వడదెబ్బ వచ్చే అనుకూలతలు చిన్న పిల్లల్లో, వద్ధుల్లో ఎక్కువగా వడదెబ్బ వస్తుందని, ఎండలో ఎక్కువగా పనిచేయడం వల్ల కానీ, ఎక్కువగా తిరగటం వల్ల వడదెబ్బ తగులుతుందని తెలిపారు. ఎండలో, గాలిలేని చోట పనిచేస్తే తక్కువ నీరు, ఉప్పు లవణ ద్రావణాలు తీసుకోకపోవడం వల్ల వడదెబ్బ తగులుతుందని పేర్కొన్నారు.

వడదెబ్బకు ప్రథమ చికిత్స

1. వడదెబ్బకు గురైనట్లు అనుమానం ఉంటే అటువంటి వారిని ఎండ నుంచి గాలి, వెలుతురు, నీడ ఉన్న ప్రదేశానికి వెంటనే తర లించాలని సూచించారు.

2. శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గించుకునేందుకు చల్లని నీటితో తడిసిన గుడ్డతో శరీరం అంతటా తుడుస్తూ ఉండాలని అన్నారు.

3. వడదెబ్బకు గురైన వారు ధరించిన దుస్తులు వదులు చేయాలని, చల్లటి గాలి ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

4. వడదెబ్బకు గురైన వారు క్రమం తప్పకుండా చల్లటి నీరు తాగుతూ ఉండాలని చెప్పారు.

వడదెబ్బ తగులకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండలో ఎక్కువగా తిరగరాదని, ఎండలో తిరిగేటప్పుడు తలకు టోపీ, గొడుగు, టవల్‌ కానీ ఉపయోగించాలని, ఎక్కువగా పనిచేయకూడదని, ఒకవేళ పనిచేయాల్సి వస్తే ఎక్కువ నీరును ఉప్పుతో కలిపి తీసుకోవాలని సూచించారు. మధ్యమధ్యలో విశ్రాంతి తీసు కుంటూ ఉండాలని, వేడి తాపం వల్ల మొదట కండరాల నొప్పి, అలసట కలుగుతుందని, చెమట ద్వారా శరీరంలోని నీరు బయటకు వెళ్తుందని అన్నారు. దీనిని ఎండ అలసట అంటారని, ఎండలో అలాగే పనిచేస్తే మనిషి అపస్మారకస్థితిలోకి వెళ్లే ప్రమాదముందని తెలిపారు. ఆ సమయంలో ఉప్పు కలిపిన నీటిని తాగాలని, ఎక్కువ ఎండ అలసట వస్తే నీటిలో తడిపిన గుడ్డతో శరీరాన్ని తడిపి చల్లగాలి తగిలేలా పడుకోబెట్టాలని అన్నారు. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని, అప్పటికీ తగ్గకుండా ఉంటే డాక్టరును సంప్రదించాలని, ప్రజలంతా తప్పనిసరిగా పైసూచనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ennikala sadarana parishilakuluga sharavanan, ఎన్నికల సాధారణ పరిశీలకులుగా శరవణన్‌

ఎన్నికల సాధారణ పరిశీలకులుగా శరవణన్‌

జిల్లాలో జరగనున్న ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సి.శరవణన్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు సాధారణ పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలకు సంబంధించి ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే ఎన్నికల సాధారణ పరిశీలకులు సి.శరవణన్‌ మొబైల్‌ నంబర్‌ 9440810105లో సంప్రదించాలని జిల్లా ఎన్నికల అధికారి పి.వెంకట్రామరెడ్డి ప్రజలకు సూచించారు. జిల్లాలో ఎన్నికలు ముగిసేంత వరకు సాధారణ పరిశీలకులు ఫోన్‌లో అందుబాటులో ఉంటారన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

kcr gadde digali, కేసిఆర్‌ గద్దె దిగాలి

కేసిఆర్‌ గద్దె దిగాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కారు…16 అంటే ఎలాగోలా తంటాలు పడి నయానో…భయానో 16సీట్లను గెలిపించుకుంటారనీ అనుకున్నామని, కానీ ఇలా ఘోరాతిఘోరంగా 16మంది విద్యార్థులను బలి కొంటారని ఎవరూ ఊహించలేదని, కేసిఆర్‌ చరిత్ర అంతా ఇలా నమ్మించి ప్రాణాలు తీసిన చరిత్రేనని ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డిఎస్‌ఓ), తెలంగాణ కమిటీ (యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌)) కిషన్‌ వర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే తెలంగాణా సాధనకు ఎంతగానో కషి చేసిన ఎంటెక్‌ విద్యార్థిని తంగెళ్ళ శృతిని వరంగల్‌ జిల్లా మొద్దుగుట్ట వద్ద ఎన్‌కౌంటర్‌ పేరిట చంపివేశారని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని అదిష్టించినందుకు ఇచ్చిన బలి అని ఎద్దేవా చేసింది. ఇప్పుడు కేంద్రంలో అధికారం చేసేందుకు 16మంది విద్యార్థులను బలి తీసుకున్నారని విమర్శించింది. ఇదంతా కేసిఆర్‌ పాలనా దక్షతకే నిదర్శనమని, కనుక ఈ హత్యలన్నింటికీ కెసిఆరే భాద్యత వహించి రాజీనామా చేయాలని అన్నిరంగాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఉపాద్యాయులు, యువతీ, యువకులు, ముఖ్యంగా అనేకంగా నష్టపోయిన విద్యార్థులు, వారి తల్లి తండ్రులు కోరుతున్నారని తెలిపింది. నల్లగొండలో ఎమ్మెల్యేను నిలదీసినట్లుగా అడుగడునా నిలదీయాలని పేర్కొంది. శృతితోపాటు విద్యాసాగర్‌ను, ఖమ్మంలో 12మంది సీపీబాట సంస్థ సభ్యులను కూడా ఎన్‌కౌంటర్‌ పేరుతో ప్రభుత్వం చంపివేసిందని ఆరోపించింది.

kaleshwaram project wet run vijayavantham, కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం

కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్క తం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ పూజలు నిర్వహించి స్విచాన్‌ చేసి వెట్‌ రన్‌ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్‌పూల్‌ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్‌ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి. అక్కడి నుంచి గోదావరి జలాలు లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌కు చేరనున్నాయి. లక్ష్మీపూర్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు మిడ్‌మానేరుకు చేరుకోనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్‌ మొదలు అనేక జిల్లాల్లో దాదాపు 151టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించి నిల్వ చేసేందుకు మొత్తం 82మోటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కనిష్టంగా 2.66మెగావాట్ల నుండి మొదలు 26, 40, 106…ఇలా ఆసియాలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న..బాహుబలిగా పిలిచే 139మెగావాట్ల మోటరును కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. వీటి ఏర్పాట్లు వివిధ దశల్లో ఉన్నాయి. నందిమేడారం పంపుహౌజ్‌లో 124.4మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను అమరుస్తున్నారు. ఏడింటికిగాను నాలుగు డ్రైరన్‌ పూర్తి చేసుకొని, వెట్‌ రన్‌ కు సిద్ధంగా ఉన్నాయి.

mera bharat mahan, మేరా భారత్‌ మహాన్‌

మేరా భారత్‌ మహాన్‌

ప్రతాప ప్రొడక్షన్‌ పతాకంపై భారత దర్శకత్వంలో నిర్మితమైన చిత్రం మేరా భారత్‌ మహాన్‌ ఈనెల 26వ తేదీ శుక్రవారం విడుదలవుతుందని చిత్ర నిర్మాతలు డాక్టర్‌ శ్రీధర్‌ రాజు, డాక్టర్‌ తాళ్ల రవి, డాక్టర్‌ పల్లవి రెడ్డి తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో వారు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150 థియేటర్లలో శుక్రవారం విడుదల అవుతుందని తెలిపారు. యువత సంకల్పిస్తే దేశం బాగుపడుతుందని, సమాజంలోని సమస్యలను అరికట్టవచ్చని, యువతను చైతన్యపరిచేలా ఈ చిత్రాన్ని నిర్మించామని పేర్కొన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎలా ఎదుర్కొవాలని ఈ చిత్రంలో చూపించామని చెప్పారు. ఈ చిత్రం ద్వారా యువతకు మంచి సందేశాన్ని కూడా ఇచ్చామని అన్నారు. ఈ చిత్రానికి ఎర్రంశెట్టి సాయి డైలాగ్స్‌, లలిత్‌ సురేష్‌ మ్యూజిక్‌, పెద్దాడ మూర్తి సాహిత్యాన్ని సమకూర్చగా, ఈ చిత్రంలో అఖిల్‌ కార్తిక్‌, ప్రియాంకశర్మ హిరోహిరోయిన్లుగా నటించారని తెలిపారు. అనంతరం గవర్నర్‌ లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ లయన్‌ పొట్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని, అప్పడే సమాజం బాగుంటుందనే సామాజిక స్పృహతోపాటు ప్రేమ, వినోదభరిత అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారన్నారు. లయన్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారని, ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు అందులోని లోటుపాట్లను చూపిస్తూ రెండు కుటుంబాలలో జరిగిన యదార్థగాదను ఈ చిత్రంలో చూపించారని తెలిపారు. ఈ సమావేశంలో లయన్‌ అప్పరాజు, లయన్‌ అంజిరెడ్డి, లయన్‌ కోదండపాణి, లయన్‌ బి.వెంకటేశ్వర్లు, లయన్‌ మురళీధర్‌, అడ్వకేట్‌, సినీ నటుడు కెఆర్‌.నాగరాజు, డిసిపి లయన్‌ నేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

repu nagaramlo jadugar anand blind fold root, రేపు నగరంలో జాదుగర్‌ ఆనంద్‌ ‘బ్లైండ్‌ ఫోల్డ్‌ రూట్‌’

రేపు నగరంలో జాదుగర్‌ ఆనంద్‌ ‘బ్లైండ్‌ ఫోల్డ్‌ రూట్‌’

ప్రఖ్యాత ఇంద్రజాల మాంత్రికుడు జాదూగర్‌ ఆనంద్‌ బ్లైండ్‌ ఫోల్డ్‌ రూట్‌ ఈనెల 25వ తేదీ గురువారం ఉదయం 11గంటలకు ప్రారంభమవుతుందని జాదూగర్‌ ఆనంద్‌ తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో పుట్టానని, ఇప్పటి వరకు 33వేల షోలు చేసి పలు అవార్డులను పొందానని తెలిపారు. 1980లో బ్రస్సేలో ఇచ్చిన ప్రదర్శనకు దిగ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. అమెరికా, యూరప్‌, ఆసియా, అస్ట్రేలియా, ఆఫ్రికా వంటి 36దేశాలలో 33వేల ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచంలోనే ఉత్తమ జాదూగర్‌గా నిలిచానని అన్నారు. ఇంద్రజాలం రికార్డుల కోసమే కాకుండా మనిషిలో మనోవికాసాన్ని పెంపొందింపజేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంద్రజాలాన్ని ఓ విద్యగా గుర్తించి దేశంలో మ్యాజిక్‌ ఆకాడమీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నో అవార్డులు, ప్రశంసలు, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సాధించిన తను వరంగల్‌ నగరంలో బ్లైండ్‌ ఫోల్డ్‌ ర్యాలీ నిర్వహిస్తున్నానని తెలిపారు. గురువారం ఉదయం 11గంటలకు అనికా బజాజ్‌ నుండి ప్రారంభమై పోచమ్‌మైదాన్‌, వెంకటరమణ థియేటర్‌ మీదుగా లేబర్‌కాలనీ, 100ఫీజ్‌ రోడ్‌, కాశిబుగ్గ, ములుగురోడ్డు మీదుగా హన్మకొండ, అదాలత్‌, కాజీపేట, ఎన్‌ఐటి నుండి చివరకు అనికా బజాజ్‌ షోరూమ్‌ వరకు ర్యాలీ ముగుస్తుందని తెలిపారు.

vidyardula jivithalatho chelagatamadutunna interboard, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇంటర్‌బోర్డు

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇంటర్‌బోర్డు

విద్యార్థుల జీవితాలతో ఇంటర్‌బోర్డు చెలగాటమాడుతోందని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మల్యాల వినయ్‌గౌడ్‌ ఆరోపించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మాల్యాల వినయ్‌ గౌడ్‌ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో ఇంటర్మీడియట్‌ బోర్డు చెలగాటం అడుతుందని, ఇంటర్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సరైన పద్దతిలో స్పందించడం లేదని విమర్శించారు. తక్కువ మార్కులు వచ్చి అన్యాయం జరిగినా విద్యార్థులకు ఉచితంగా రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ చేయాలని ఇంటర్మీడియట్‌ బోర్డు, గ్లోబరినా సంస్థ చేసిన తప్పులకు విద్యార్థులను బలిచేయద్దని అన్నారు. ఇంటర్మీడియట్‌ బోర్డులో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా భరోసా కల్పించాలని కోరారు. 17మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంటర్మీడియట్‌ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు వేణు, భూమేష్‌, వెంకటేష్‌, అబ్బాస్‌, సాయి, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

repu jobmela, రేపు జాబ్‌మేళా

రేపు జాబ్‌మేళా

కాటారం మండలంలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఈనెల 25వ తేదీ ఉదయం 10గంటలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని, ఈ జాబ్‌ మేళాను యువతి, యువకులు సద్వినియోగం చేసుకోగలరని కాటారం పోలీసులు తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి మినీ ఫంక్షన్‌ హాల్‌ (అంబేద్కర్‌ స్టేడియం సమీపంలో) ఎస్పీ భాస్కరన్‌ అద్వర్యంలో ‘జాబ్‌ మేళా’ నిర్వహించబడునని అన్నారు. ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, ఎంటెక్‌ పూర్తి చేసిన యువతి, యువకులు బుధవారం సాయంత్రం 5గంటలలోపు పేరు, సెల్‌ నంబర్‌ కాటారం పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. అసక్తి గల యువతి, యువకులు గురువారం ఉదయం 8గంటలకు కాటారం పోలీస్‌స్టేషన్‌ నుండి బస్‌ల ద్వారా భూపాలపల్లి తీసుకువెళతారని తెలిపారు.

ennikaloo athyadika stanalu geluchela karyakarthalu krushi cheyali, ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచేలా కార్యకర్తలు కృషి చేయాలి

ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచేలా కార్యకర్తలు కృషి చేయాలి

రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకునే విధంగా టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కషి చేయాలని వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఐనవోలు మండల కేంద్రంలో ఐనవోలు మండల ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఆశావాహులతో ఎమ్మెల్యే అరూరి రమేష్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అరూరి రమేష్‌ మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికలను ఏకగ్రీవం చేసిన గ్రామాలకు సీడిఎఫ్‌ నిధుల నుండి 15లక్షలు కేటాయించనున్నట్లు ప్రకటించారు. వర్థన్నపేట నియోజకవర్గంలోని అన్ని స్థానాలలో గులాబీ జెండా ఎగురవేయాలని, దానికోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా పనిచేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో¸ ఎన్నికల ఇన్‌చార్జ్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు సమ్మయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

carekkannunna mla gandra, కారెక్కనున్న ఎమ్మెల్యే గండ్ర…?

కారెక్కనున్న ఎమ్మెల్యే గండ్ర…?

తెలంగాణ రాష్ట్రంలో ఒకొక్కరుగా హస్తాన్ని వీడి కారెక్కుతుండగా మరో ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కారు ఎక్కుతున్నట్లుగా తెలుస్తుంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. గత కొద్దినెలలుగా టిఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉంటున్న ఆయన సతీసమేతంగా గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. మొన్నటి వరకు మంత్రిపదవి కావాలని, ఇస్తేనే పార్టీలో చేరుతానని చెప్పడంతో అధిష్టానం కొద్దిగా ఆలోచనలో పడింది. సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి గండ్ర జ్యోతికి ఇస్తామని గులాబీ బాస్‌ హామీ ఇవ్వడంతో గండ్ర దంపతులు కారెక్కేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వారం రోజుల్లో వీరు గులాబీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి గండ్ర వెంకటరమణరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరితే ఇక కాంగ్రెస్‌ పార్టీకి మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యే.

pariksha kendralanu sandarshinchina cp doctor ravinder, పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్‌ రవీందర్‌

పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్‌ రవీందర్‌

స్టఫండరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తుది రాతపరీక్ష జరుగుతున్న పరీక్షా కేంద్రాలను శనివారం వరంగల్‌ నగర పోలీస్‌ కమీషనర్‌ డాక్టర్‌ వి. రవీందర్‌ సందర్శించారు. ఈ సందర్బంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు కల్పించిన ఏర్పాట్లపై పోలీస్‌ కమీషనర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఉదయం, మద్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రం ఆవరణలోనే తినుబండారాలు కొనుగోలు చేసుకొనేందుకు వీలుగా పుడ్‌స్టాల్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత పరీక్షా కేంద్రం ఇంచార్జ్‌లకు పోలీస్‌ కమీషనర్‌ ఆదేశించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version