ennikaloo athyadika stanalu geluchela karyakarthalu krushi cheyali, ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచేలా కార్యకర్తలు కృషి చేయాలి

ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచేలా కార్యకర్తలు కృషి చేయాలి

రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకునే విధంగా టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కషి చేయాలని వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఐనవోలు మండల కేంద్రంలో ఐనవోలు మండల ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఆశావాహులతో ఎమ్మెల్యే అరూరి రమేష్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అరూరి రమేష్‌ మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికలను ఏకగ్రీవం చేసిన గ్రామాలకు సీడిఎఫ్‌ నిధుల నుండి 15లక్షలు కేటాయించనున్నట్లు ప్రకటించారు. వర్థన్నపేట నియోజకవర్గంలోని అన్ని స్థానాలలో గులాబీ జెండా ఎగురవేయాలని, దానికోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా పనిచేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో¸ ఎన్నికల ఇన్‌చార్జ్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు సమ్మయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version