business unn varike bank linkege, బిజినెస్‌ ఉన్న వారికే బ్యాంకు లింకేజ్‌

బిజినెస్‌ ఉన్న వారికే బ్యాంకు లింకేజ్‌

బ్యాంకు లింకేజ్‌ బిజినెస్‌ ఉన్న వారికే నాల్గవ లింకేజ్‌ ఇవ్వాలని సూచించామని రాజన్న సిరిసిల్ల జిల్లా మెప్మా పథక సంచాలకులు డాక్టర్‌ కె.వి.రమణాచారి అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో మెప్మా సిబ్బంది, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంకు లింకేజ్‌, సెప్‌ టార్గెట్‌ బ్యాంకుల వారిగా తెలిపారు. ఈ సమావేశంలో ఎల్‌డిఎం రంగారెడ్డి, వివిధ బ్యాంకుల మేనేజర్లు, ఫీల్డ్‌ ఆఫీసర్లు, మెప్మా డిఎంసి ఎం.సుమలత, ఎడిఎంసి భూలక్ష్మి, మెప్మా సీఓలు మహాలక్ష్మి, ఇ.శ్రీమతి, ఎం.రాజేశం, డి.సుగంధ, వేములవాడ సిఎల్‌ఆర్‌పిలు కె.బాబాయ్‌, కె.కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

ennikalaku siddamga unnaam : sp rahul hegde, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం : ఎస్పీ రాహుల్‌ హెగ్డే

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం : ఎస్పీ రాహుల్‌ హెగ్డే

రాబోవు ఎన్నికలు ఫెయిర్‌ అండ్‌ ఫ్రీగా నిర్వహించడమే లక్ష్యంగా అన్ని రకాల భద్రత చర్యలతో సంసిద్ధంగా ఉన్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు. శుక్రవారం సిరిసిల్లలోని పంచాయతీ రాజ్‌ గెస్ట్‌ హౌస్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ ు ఎన్నికల సాధారణ పరిశీలకులు సి.శరవణన్‌తో పాల్గొన్నారు. రాబోవు ఎన్నికల నిర్వహణ శాంతియుత వాతావరణంలో నిర్వహించటమే లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశం కొనసాగింది. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మూడు దశలలో జరిగే ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల

పటిష్టమైన చర్యలు వివరించారు. జిల్లాలో మొత్తం 266 లోకేషన్లలో పోలింగ్‌ కేంద్రాలు 699, వాటిలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 90, నార్మల్‌ పోలింగ్‌ కేంద్రాలు 176 ఉన్నాయని తెలిపారు. ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలు తయారుచేసి సిద్ధంగా ఉన్నామని, పోలింగ్‌ కేంద్రాలు వాటి స్థితిగతులు భౌగోళిక పరిస్థితుల గురించి పోలింగ్‌ కేంద్రం వద్ద ఎంత మంది పోలీసు భద్రత అవసరము, ఏ విధమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జిల్లా పరిధిలోని అన్నీ బార్డర్‌ పిఎస్‌ పరిధిల్లో (స్టాటిక్‌ సర్వే లెన్స్‌ టీమ్స్‌ 4, చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం, 12 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, 03 చెక్‌పోస్ట్‌లు 24-7 నిరంతరాయంగా వాహనాలు తనిఖీ చేయడం గురించి వివరించారు. ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికలలో 1,14,640/- రూపాయల విలువ గల 305.2లీటర్లు, లోక్‌సభ ఎన్నికలలో 631.14 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్‌ చేశామని చెప్పారు. పెండింగ్‌లో వారెంట్లు అమలు చేశామని, ఇప్పటివరకు 1230మందిని 280కేసులలో శాంతిభద్రతల విఘాతం కలిగించే వ్యక్తులు, పాత నేరస్తులను బైండోవర్‌ చేశామని తెలిపారు. తరచుగా కార్డెన్‌సెర్చ్‌ ఆపరేషన్‌లు నిర్వహిస్తూ ముందస్తు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కళాబందంచే జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎన్నికల నియమావళి, పలు ముఖ్య చట్టాలు, సాంస్క తిక కార్యక్రమాల ద్వారా అవగాహన కలగజేస్తూ ప్రజలు స్వేచ్చాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకొనేలా కషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం అబ్జర్వర్‌ సి.శరవణన్‌ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సాంకేతిక నైపుణ్యన్నీ ఉపయోగించుకొని పనిచేయాలని, ఎన్నికలు ప్రశాంత, స్వేచ్చాయుత వాతావరణంలో ప్రజలు అందరు తమ ఓటుహక్కును ఉపయోగించుకొనే విధంగా వారికి అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. ఎలక్షన్‌కు సంబంధించిన చిన్న సంఘటన జరిగినా, ఫిర్యాది వచ్చిన వీడియోగ్రాఫ్‌, సీసీ కెమెరాలు, సీసీ కెమెరా ఫుటేజ్‌ డాక్యుమెంటేషన్‌ తప్పనిసరిగా ఉండాలని, అధికారులందరూ చాలా జాగ్రత్తగా అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. ప్రతి స్టేషన్‌ పరిధిలో ఉన్న పోలింగ్‌ బూత్‌లను ఎల్లపుడు సందర్శిస్తూ, స్థానికులతో సత్సంబంధాలు కలిగి యుండాలని తెలిపారు. అధికారులు ఇన్‌ఫర్మేషన్‌ వ్యవస్థను రూపొందించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు, ప్రతి పోలీసు అధికారి పక్కా ప్రణాళికతో సిద్ధంగా వుండాలని సూచించారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల సమన్వయ అధికారి బి.గౌతంరెడ్డి పాల్గొన్నారు.

prajalu jagrathaga vyavaharinthali, ప్రజలు జాగ్రత్తగా వ్యవహారించాలి

ప్రజలు జాగ్రత్తగా వ్యవహారించాలి

ఇటీవల కాలంలో కొంతమంది నేరచరిత్ర గల అంతర్‌రాష్ట్ర ముఠాలు తప్పుడు ధృవపత్రాలు సమర్పించి బ్యాంక్‌ మేనేజర్‌ అంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌ సీఐ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం వారు బ్యాంకు కస్టమర్లకు పలు సూచనలు చేశారు. బ్యాంకు మేనేజర్‌ను అంటూ మొబైల్‌ సిమ్‌కార్డు పొంది అమాయకులైన బ్యాంక్‌ కస్టమర్‌లకు ఫోన్‌ చేస్తూ హిందీలో మాట్లాడతారని తెలిపారు. బ్యాంక్‌ మేనేజర్‌ను మాట్లాడుతున్న అని పరిచయం చేసుకుని, అకౌంట్‌ పూర్తిగా అప్‌డేట్‌ చేస్తున్నామని, అకౌంట్‌ నెంబర్‌ చెప్పమని కొరగానే చాలా మంది నిజంగానే మాట్లాడుతున్న వ్యక్తి బ్యాంక్‌ అధికారి అని నమ్మి తమ అకౌంట్‌ నెంబర్‌ చెబుతున్నారని అన్నారు. వెంటనే ఆ వ్యక్తి ఆ అకౌంట్‌ నుండి డబ్బులు డ్రా చేయడం మొదలుపెడతాడని, అతను డబ్బులు డ్రా చేయడం మొదలు పెట్టగానే కస్టమర్‌ ఫోన్‌కి మెసేజ్‌ వస్తుందని చెప్పారు. బ్యాంక్‌ మేనేజర్‌గా మాట్లాడుతున్న వ్యక్తి నెంబర్‌ చెప్పవలసిందిగా కోరతాడని, ఆ తర్వాత అమాయకంగా చాలామంది తమ సెల్‌ఫోన్‌కి వచ్చిన ఓటిపి నెంబర్‌ వారికి చెప్పగానే వారి అకౌంట్‌లో డబ్బులు మాయం అయిపోతాయని తెలిపారు.

కింది సూచనలు పాటించండి

1) బ్యాంక్‌ అధికారులమని ఏ అపరిచితవ్యక్తి ఫోన్‌ చేసిన నమ్మకండి. కావాలంటే బ్యాంకుకి స్వయంగా వెళ్లి మేనేజర్‌తో మాట్లాడాలని తెలిపారు.

2) అపరిచిత వ్యక్తితో అకౌంట్‌ నెంబర్‌ షేర్‌ చేసుకోవద్దని, చెప్పవద్దని అన్నారు.

3) బ్యాంక్‌ మేనేజర్‌ ఫోన్‌ చేసి అకౌంట్‌ నెంబర్‌ గురించి వివరాలు అడగరని, ఎవరైనా ఫోన్‌ చేస్తే వెంటనే అనుమనించాలని తెలిపారు.

4) బ్యాంక్‌ అకౌంట్‌, పిన్‌ నెంబర్‌, ఆస్తి, ఆస్తిని కొల్లగొట్టడానికి కొన్ని ముఠాలు వల వేసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని, అమాయకంగా నమ్మి కష్టపడి సంపాదించిన సొమ్మును ఇతరుల పాలు చేసుకోవద్దని అన్నారు.

manasika balopetha vidya vidanam ravali : r.laxman sudhakar, మానసిక బలోపేత విద్యా విధానం రావాలి: ఆర్‌.లక్ష్మణ్‌ సుధాకర్‌

మానసిక బలోపేత విద్యా విధానం రావాలి: ఆర్‌.లక్ష్మణ్‌ సుధాకర్‌

విద్యార్థులను మానసికంగా బలోపేతం చేసే భారతీయ విద్యా విధానం రావాలని, దాని వల్లనే వ్యక్తిత్వం వికసించి బుద్ధి, వివేకం పెరిగి జయాపజయాలను ఒకే విధంగా స్వీకరిస్తారని, తద్వారా అ నుత్తీర్ణులు అయినప్పుడు ఆత్మహత్యల జోలికి పోరని ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ ప్రచార ప్రముఖ్‌ ఆర్‌.లక్ష్మణ్‌ సుధాకర్‌ అన్నారు. శ్రీరామకష్ణ మఠం హైదరాబాద్‌ మార్గదర్శనంలో శ్రీ రామకష్ణ సేవా సమితి హనుమకొండ శాఖ నక్కలగుట్టలోని వివేకానంద హైస్కూల్‌లో నిర్వహిస్తున్న వేసవి వ్యక్తిత్వ వికాస శిక్షణా శిబిరం బాలసంస్కార్‌లో శుక్రవారం ఆయన పాల్గొని ఆదర్శ విద్యార్థి లక్షణాలు అనే అంశంపై మాట్లాడారు. ఒత్తిడితో కూడిన విద్యావిధానం ఫలితంగానే విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. స్వామి వివేకానంద ప్రవచించిన భారతీయ విద్యా విధానమే నేటి తరానికి ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. శీల సంపదను వద్ధి చేసి, మనోబలాన్ని పెంపొందించి, బుద్ధిని వికసింప చేసి, స్వశక్తిలో విశ్వాసాన్ని పెంచే విద్యను స్వామీజీ ఆశించాడన్నారు. నేటి తల్లిదండ్రుల కోరిక మేరకు డాలర్లు సంపాదించడానికి కావలసిన విద్య కోసం విద్యార్థులు రేయింబవళ్లు నిద్రాహారాలు మాని కార్పోరేటు బడుల్లో, కళాశాలల్లో కుస్తీలు పడుతున్నారు. ఈ విధానం మారి విద్యార్థి కోరికకు అనుకూలమైనటువంటి స్వేచ్చాయుత, నైతిక విలువలతో కూడిన, మానవీయ విలువలు నిండిన విద్యా విధానం వచ్చినప్పుడే విద్యార్థులు స్వేచ్చగా విద్యార్జనపైన దష్టి కేంద్రీకరిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు చదివింది గుర్తుంచుకునేలా కొన్ని అధునాతన టెక్నిక్లను పరిచయం చేశారు. వారంరోజులు నిర్వహించే ఈ శిబిరంలో ఆదర్శ విద్యార్థి, ఏకాగ్రత రహస్యం, గురు శిష్యుల సంబంధము, మాతపిత భక్తి, భారతీయ వారసత్వ వైభవం, మన ఆచారాలు ఆదర్శాలు, దేశభక్తి అనే అంశాలపై వక్తలు విద్యార్థులకు శిక్షణ ఇస్తుంటారు. అంతేకాకుండా యోగాసనాలు, ధ్యానము, వేదిక్‌ మాథ్స్‌, ఆకర్షణీయమైన చేతిరాత, నత్యం, ఆటలు, పాటలు, మట్టితో బొమ్మలు చేయుట తదితర అంశాలలో నిష్ణాతులతో శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో శిబిర నిర్వాహాకులు, శ్రీరామకష్ణ సేవా సమితి హనుమకొండ శాఖ ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, రాధిక, స్వరూప, అశ్వి వివేక్‌, లక్ష్మణ్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

warangal vastravyaparaniki gundekaya, వరంగల్‌ వస్త్రవ్యాపారానికి గుండెకాయ

వరంగల్‌ వస్త్రవ్యాపారానికి గుండెకాయ

వరంగల్‌ నగరం వస్త్రవ్యాపార రంగానికి గుండెకాయ లాంటిదని కాకతీయ ఆల్‌షాప్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నగరబోయిన బాబురావు అన్నారు. శుక్రవారం వరంగల్‌లోని ఆర్యవైశ్య భవనంలో యూనియన్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో అనేకమంది కార్మికులు పనిచేస్తున్నారని, కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత లేకుండా పేదరికంలో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు జరగడం లేదని అన్నారు. కార్మికులు న్యాయం కోసం ఐక్యంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. యజమానులు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం నగర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

polycet falithalu vidudala, పాలిసెట్‌ ఫలితాలు విడుదల

పాలిసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర పాలీసెట్‌-2019 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌ బిఆర్‌కే భవన్‌లోని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ కార్యాలయంలో టెక్నికల్‌ బోర్డు కమిషనర్‌, చైర్మన్‌ నవీన్‌ మిట్టల్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ పాలిసెట్‌ ఫలితాలలో 92.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. స్టేట్‌ మొదటి ర్యాంకు సిద్దిపేట జిల్లాకు చెందిన మంకాల సజనకు, రెండవ ర్యాంక్‌ సూర్యాపేట జిల్లాకు చెందిన ఆరురి సాత్విక్‌కు దక్కాయి. ఈ పాలిసెట్‌-2019 పరీక్షలో 1,06,295 మంది అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా, 1,03,587 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 92.53శాతం, 95,850అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా, అందులో 61505 బాలురు పరీక్ష రాయగా, 55933మంది ఉత్తీర్ణత (90.94శాతం) సాధించారు. 42082 బాలికలకు 39917మంది ఉత్తీర్ణత (94.86శాతం) సాధించారు. మే మొదటి వారంలో కౌన్సిలింగ్‌, జూన్‌ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయి.

mamidi pandlatho jagratha, మామిడి పండ్లతో జాగ్రత్త

మామిడి పండ్లతో జాగ్రత్త

మామిడి సీజన్‌ వచ్చింది. దోరగా కంటికి ఇంపుగా ఉన్నాయని మామిడి పండ్లను కొని తింటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు వైద్యులు. మామిడి పండ్లను అమ్మే వ్యాపారులు మార్కెట్‌లో వ్యాపారాన్ని దష్టిలో ఉంచుకుని పచ్చి మామిడికాయలను కొనుగోలు చేసి వాటిని వివిధ రకాలుగా మాగబెట్టి ఉంచుతున్నారు. ఇలా ఒక్కరోజు పచ్చి మామిడికాయలను ఉంచితే చాలు రెండురోజుల్లో దోరగా పండిన మామిడి పండ్లు రెడీ. వాటినే వ్యాపారులు మార్కెట్లకు తరలిస్తున్నారు. కంటికి దోరగా పండినట్లు కనబడే మామిడి పండ్లను చూసి వినియోగదారులు మోసపోతున్నారు. రసాయనాల ద్వారా మగ్గపెట్టిన మామిడి పండ్లను తీసుకున్న వారికి తొలుత కడుపునొప్పి మొదలవుతుంది. ఆ తర్వాత గ్యాస్ట్రిక్‌ సమస్య, విరేచనాలు, వాంతులు మొదలవుతాయి. చివరకు మనిషి పూర్తిగా నీరసించిపోతాడు. తిరిగి కోలుకోవడానికి సెలైన్‌ పెట్టాల్సి రావచ్చు. అంతేకాదు ఈ సీజన్‌ మొత్తం ఇటువంటి కాయలను తీసుకున్న వారిలో పెప్టిక్‌ అల్సర్‌ తలెత్తే తీవ్రమైన ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు అమ్ముతున్న మామిడి పండ్లు సరైనవో…కాదో తనిఖీ చేయాల్సిన అధికారులు జాడ లేకుండా పోతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాగా నల్లటి మచ్చలతో పండిన మామిడికాయ దర్శనమిస్తే అది రసాయనాల ద్వారా మగ్గబెట్టిందని తెలుసుకోవాలి. అయితే అన్ని సందర్భాల్లో ఇది నిజమని చెప్పలేమంటున్నారు నిపుణులు.

రసాయనాల పండును ఎలా గుర్తించాలి

రసాయనాలతో పండించిన మామిడి పండు తొక్క, మామిడికాయను తినేటపుడు తేలికగా ఊడిపోతుంటుంది. అదే చెట్టుకే పండిన మామిడికాయ అయితే మంచి సువాసనను కలిగి తినేటపుడు తొక్క కూడా చాలా దఢంగా ఉంటుంది. అదే మధురఫలం. అయితే ఇందులోనూ కల్తీ రాయుళ్లు ఎందరి ఆరోగ్యంతోనో చెలగాటమాడుతున్నారన్నమాట.

మామిడిపండు తింటే ఆరు ఉపయోగాలు

వేసవికాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి పండు. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం…

1. మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. విటమిన్‌ సి ఇంకా ఫైబర్‌ శరీరంలో హాని చేసే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.

2. మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్‌ కూడా ధడంగా ఉంటుంది.

3. మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం ఇంకా అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది.

4. దోరగా పండిన మామిడిలో ఐరన్‌ సమద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్‌ ఎర్ర రక్తకణాల వద్దికి దోహదపడుతుంది.

5. ఈ పండులో వుండే విటమిన్లు, ఇంకా ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతుంది. వద్దాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. శంగారంలో ఆసక్తి లేనివారికి శంగార వాంఛను కలిగిస్తుంది.

6. మామిడిపండులో శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్‌ అనే పదార్దం సమద్దిగా ఉంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది.

అతిగా తిన్నా ఇబ్బందే

ప్రస్తుతం చాలామంది వ్యాపారులు మామిడి పండ్లను సహజసిద్ధంగా మాగబెట్టడం లేదు. కాల్షియం కార్బైడ్‌ అనే కెమికల్‌ను వాడి ఆర్టిఫిషియల్‌గా మగాబెడుతున్నారు. వీటిని అధికంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కాళ్లు, చేతులు లాగడం, తిమ్మెర్లు వంటి రుగ్మతల బారిన పడతారు.

అజీర్తి సమస్య

సరిగా మాగని మామిడి పండ్లను తినడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. పొట్టలో మంట, సరిగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలతో బాధపడతారు. పచ్చి మామిడిని ఎంత తక్కువ తింటే అంత మంచిది.

చర్మ సంబంధిత వ్యాధులు..

మామిడి పండ్లను విపరీతంగా తినేవాళ్లలో గమనించిన మరో సమస్య అలర్జీ. చర్మంపై బొబ్బలు, సెగగడ్డలు, ఎర్రటి కాయలు వస్తాయి. మామిడి పండ్లు శరీరానికి వేడి చేస్తాయని పెద్దలు అంటుంటారు. అందువల్లే సెగగడ్డలు వస్తాయి.

మధుమేహం పెరుగుతుంది

మామిడి పండ్లలో ఫ్రక్టోజ్‌ అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్‌ లెవెల్స్‌ అమాంతం పెరిగిపోతాయి. డయాబిటిస్‌తో బాధపడుతున్నవారు. మామిడి పండ్లకు దూరంగా ఉండటమే ఉత్తమం అని నిపుణులు తెలుపుతున్నారు.

చోద్యం చూస్తున్న మార్కెట్‌ అధికారులు :

వరంగల్‌ పండ్ల మార్కెట్‌లో మామిడి అమ్మకాలు జోరందుకున్నాయి. మార్కెట్‌ ఆదాయాన్ని పెంచడంలో దష్టి పెట్టిన అధికారులు మామిడి పండ్లు రసాయనాలతో మాగబెట్టి తీసుకువస్తున్న దళారులపై చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఇలా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు రసాయన ద్రవ్యాల నియంత్రణపై దష్టి సారించాలని మామిడి ప్రియులు కోరుతున్నారు. దళారులకు అడ్డాగా పండ్ల మార్కెట్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ అడ్డాలు వేసి మారుబేరం చేసి మార్కెట్‌ ఆదాయానికి గండి కోడుతున్నారని చెప్పొచ్చు. దళారితనాన్ని నిర్మూలించి మార్కెట్‌ ఆదాయానికి గండి పడకుండా చూడాలని మార్కెట్‌ లైసెన్స్‌ దారులు కోరుతున్నారు.

prakruthi prakash endariko adarsham: yasmin basha, ప్రకతి ప్రకాష్‌ ఎందరికో ఆదర్శం : యాస్మిన్‌ బాషా

ప్రకతి ప్రకాష్‌ ఎందరికో ఆదర్శం : యాస్మిన్‌ బాషా

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న కార్యక్రమానికి సామాజిక సేవకుడు ప్రకతి ప్రకాష్‌ శ్రీకారం చుట్టడం ఎంతో గొప్ప విషయమని సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ప్రకతి ప్రకాష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్సులలో ఉచితంగా చల్లని నీరు పంపిణీ కార్యక్రమాన్ని జెసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్న తరుణంలో ఎదుటి వారికి కూడా సాయం చేయాలనే భావనను ప్రకాష్‌ అందరికీ కల్పిస్తున్నారని అన్నారు. వయసులో చిన్నవాడు అయినప్పటికీ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడని తెలిపారు. వనజీవి రామయ్యని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో వేలసంఖ్యలో మొక్కలు నాటడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు సైతం చేపట్టడం సంతోషకరమన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న తరుణంలో బస్సులో ప్రయాణించడం ఎంతో ఇబ్బందిగా ఉంటుందని చాలా సందర్భాల్లో గుక్కేడు నీటికోసం తరువాత స్టాప్‌ వచ్చేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ప్రయాణికులకు ఎదురవుతుందన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన ప్రకాష్‌ ఆర్టీసీ బస్సులలో చల్లని నీటిని ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయమన్నారు. ప్రకాష్‌ ఆలోచనకు సహకరించిన ఆర్టీసీ సిరిసిల్ల డిపో మేనేజర్‌, సిబ్బందిని సైతం ఆమె అభినందించారు. ప్రకతి ప్రకాష్‌ మాట్లాడుతూ చల్లని నీరు పంపిణీలో బాగంగా సిరిసిల్ల నుండి హైదరాబాద్‌, కరీంనగర్‌ వెళ్లే నాన్‌స్టాప్‌ బస్సులలో చల్లని నీటి బబుల్స్‌ని ఏర్పాటు చేయడం చేశామన్నారు. ప్రతి రోజు 32 చల్లని నీటి బబుల్స్‌ని ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఉపయోగిస్తున్నామని, అందుకోసం ప్రతి రోజూ రూ.640 వెచ్చిస్తున్నట్లు వేసవికాలం ముగిసే వరకు బస్సులో ప్రయాణించే ప్రయాణికుల దాహాన్ని తీరుస్తానని ఆయన తెలిపారు. ఇలాంటి చక్కని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన జెసి యాస్మిన్‌ బాషాకి ఆయన కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

vidyarthini atmahatyayatnam, విద్యార్థినీ ఆత్మహత్యాయత్నం

విద్యార్థినీ ఆత్మహత్యాయత్నం

వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని దీక్షకుంట గ్రామానికి చెందిన జామాండ్ల అంజలీ పరీక్ష ఫెయిల్‌ కావడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటర్‌లో ఫిజిక్స్‌ పరీక్ష ఫెయిల్‌ అయిన నేపథ్యంలో మనస్థాపానికి గురై కిరోసిన్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా కుటుంబసభ్యులు, బంధువులు అంజలిని హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంజలి హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం అంజలి ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అంజలి నెక్కొండ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివింది.

rajinama yochanalo mantri jagadesh reddy…?, రాజీనామా యోచనలో మంత్రి జగదీష్‌రెడ్డి…?

రాజీనామా యోచనలో మంత్రి జగదీష్‌రెడ్డి…?

ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాలు, నెలకొన్న గందరగోళం నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం. ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాల మూలంగా విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ఆయన తీవ్రంగా కలత చెందినట్లు తెలుస్తోంది. వీటన్నింటికి తాను నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని జగదీష్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలగజేసుకుని నష్టనివారణ చర్యలు చేపడుతూ ఉచిత వెరిఫికేషన్‌ చేయాలంటూ అధికారులను ఆదేశించిన ఫలితాల్లో గందరగోళం విషయం రోజురోజుకు చిలికిచిలికి గాలివానగా మారుతోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఆందోళనకు దిగుతుండడం, రాష్ట్ర గవర్నర్‌ ఫలితాల విషయంలో ఆరా తీయడం, సున్నా మార్కులు రావడం ఏంటని అధికారులను ప్రశ్నించడంతో ఇది మరింత సీరియస్‌గా మారింది. వీటన్నింటి నేపథ్యంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న జగదీష్‌రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. ఫలితాల విషయంలో నెలకొన్న గందరగోళం మూలంగా నష్టనివారణ జరగాలంటే మంత్రి జగదీష్‌రెడ్డి రాజీనామా చేస్తే పరిస్థితి కొంతమేర చక్కబడుతుందని ప్రతిపక్షాలు, విద్యార్థుల ఆందోళనలను తగ్గించవచ్చని ప్రభుత్వం సైతం అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. జరిగిన లోపాలను సవరించుకుని విద్యార్థులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలిస్తున్న పరిస్థితిని చక్కబెట్టాలని కోరుతున్న జగదీష్‌రెడ్డి మాత్రం రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం టిఆర్‌ఎస్‌ వర్గాల్లో ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారిందని తెలిసింది. మంత్రి జగదీష్‌రెడ్డి రాజీనామా చేస్తే ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టవచ్చని కొందరు గులాబీ నాయకులు అంటున్నారు. పరిస్థితి చక్కబడుతున్న వేళ రాజీనామా యోచన ఎందుకని కొందరు అంటున్నారు.

inter re-varificationku sahakaristam, ఇంటర్‌ రీ-వెరిఫికేషన్‌కు సహకరిస్తాం

ఇంటర్‌ రీ-వెరిఫికేషన్‌కు సహకరిస్తాం

రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌కు ఉచితంగా అనుమతించి ఫెయిలైన 3లక్షల మంది ఇంటర్‌ విద్యార్థులకు బాసటగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ఇంటర్‌ అధ్యాపకుల జెఎసి కతజ్ఞతలు తెలిపింది. అద్యాపకుల జెఎసితో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి సమావేశమై రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ఏర్పాట్లపై చర్చించారు. సమావేశం అనంతరం అధ్యాపకుల జెఎసి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. వేసవి సెలవులతో సంబంధం లేకుండా విద్యాశాఖలోని 25వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియకు సహకరించాలని జనార్దన్‌రెడ్డి కోరారని, దానికి తాము సమ్మతించామని ఆయన చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం అవసరమైతే అదనపు గంటలు పనిచేయాలని కోరారన్నారు. సరైన ప్రమాణాలు లేని గ్లోబరీనా సంస్థ వల్లే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమయ్యాయని మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ఫలితాల్లో తప్పులు వస్తాయని మూడునెలల ముందే చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ పరిణామాలకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ బాధ్యత వహించాలని జెఎసి నేతలు పరోక్షంగా ఆరోపించారు. రీ-వెరిఫికేషన్‌ ప్రక్రియ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శికి అప్పగించడం మంచి నిర్ణయమన్నారు. ఇంటర్‌ బోర్డు రద్దు చేస్తారని తాము అనుకోవడం లేదని, ముఖ్యమంత్రి అన్ని అంశాలను పరిశీలిస్తారని భావిస్తున్నట్లు మధుసూదన్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

acbki pattubadina public prosecutor, ఏసిబికి పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

ఏసిబికి పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. గురువారం రాజేంద్రనగర్‌ కోర్టులో లంచం తీసుకుంటుండగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను పట్టుకున్నారు. రాజేంద్రనగర్‌ కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్నలక్ష్మి 15వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పిపి ప్రసన్నలక్ష్మిని రాజేంద్రనగర్‌ కోర్టులో పట్టుకున్నారు.

అధికారులపై గవర్నర్‌ ఆగ్రహం

అధికారులపై గవర్నర్‌ ఆగ్రహం

పదో తరగతి పాసైన విద్యార్థులు..ఇంటర్మీడియట్‌లో ఎందుకు ఫెయిల్‌ అవుతున్నారని, వారికి సున్నా మార్కులు రావడం ఏంటి’ అని గవర్నర్‌ నరసింహన్‌ అధికారులను ప్రశ్నించారు. ‘ఎన్నడూ లేనట్టు ఇంటర్‌ ఫలితాలపై వివాదం ఎందుకు జరుగుతోందని, ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటి’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్‌ విద్యార్థుల ఆందోళనలతో తాజా పరిస్థితిపై నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దాంతో బుధవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. దాదాపు 40నిమిషాల పాటు ఆయన అధికారుల నుంచి వివరాలు సేకరించారు. విద్యార్థులకు పలు సబ్జెక్టుల్లో సున్నా మార్కులు రావడానికి కారణమేంటని అడిగారు. ఇటువంటి పరిస్థితి పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ అధికారులను ఆదేశించారు. జాతీయస్థాయి పరీక్షలను పరిగణనలోకి తీసుకొని, పకడ్బందీగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, ఇంటర్‌ బోర్డు విశ్వసనీయత పెంచేలా చర్యలు ఉండాలని ఆదేశించారు. 3.2లక్షల మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని, వీరి జవాబు పత్రాల రీ-వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ ఉచితంగా చేయాలని సీఎం ఆదేశించారని అధికారులు తెలిపారు. తొలుత సెకండియర్‌ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్ణీత వ్యవధిలో వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ప్రక్రియలు పూర్తిచేయాలని సూచించారు. ఏ ఒక్క విద్యార్థి మానవ తప్పిదంతో నష్టపోకుండా చూడాలని గవర్నర్‌ స్పష్టం చేశారు. నాలుగురోజులుగా విద్యార్థుల ఆత్మహత్యలు, ఆందోళనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

2 నుంచి జర్నలిస్టుల క్రీడాపోటీలు

2నుంచి జర్నలిస్టుల క్రీడాపోటీలు

వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో మే నెల 2 నుంచి 20వ తేదీ వరకు జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, జర్నలిస్టుల మానసిక ప్రశాంతత కోసం ఈ క్రీడలు నిర్వహిస్తున్నామని హన్మకొండ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, పెరుమాండ్ల వెంకట్‌ తెలిపారు. గురువారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్‌, వాలీబాల్‌, షటిల్‌, బ్యాడ్మింటన్‌, క్యారమ్స్‌, చెస్‌ క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నామని వారు సంయుక్తంగా వెల్లడించారు. ఆసక్తి గల జర్నలిస్టులు ఈనెల 30వ తేదీ లోపు ఆయా క్రీడల టీముల వివరాలను ప్రెస్‌క్లబ్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే జర్నలిస్ట్‌ క్రీడాకారులు ప్రెస్‌క్లబ్‌ సభ్యులు మాత్రమే అయి ఉండాలని వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రెస్‌క్లబ్‌ కోశాధికారి బొమ్మినేని సునీల్‌రెడ్డి, స్పోర్ట్స్‌ కమిటీ కన్వీనర్‌ అర్షం సదానందం, ప్రెస్‌ క్లబ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

acbki pattubadina public prosecutor, ఏసిబికి పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

ఏసిబికి పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. గురువారం రాజేంద్రనగర్‌ కోర్టులో లంచం తీసుకుంటుండగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను పట్టుకున్నారు. రాజేంద్రనగర్‌ కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్నలక్ష్మి 15వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పిపి ప్రసన్నలక్ష్మిని రాజేంద్రనగర్‌ కోర్టులో పట్టుకున్నారు.

adhikarulanu suspend cheyali, అధికారులను సస్పెండ్‌ చేయాలి

అధికారులను సస్పెండ్‌ చేయాలి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటును ఆడ్డుకుని, డంపింగ్‌ యార్డుకు తరలించిన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని దళితరత్న అవార్డు గ్రహీత జన్ను రాజు అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహం తొలగించి చెత్త డంపింగ్‌ యార్డుకు తరలించిన అధికారులను శిక్షించాలని, వెంటనే భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం తొలగించిన స్థలంలోనే విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టివిఎఫ్‌ రాష్ట్ర నాయకులు పినింటి రవీందర్‌రావు, ఆడెపు సోమయ్య, సారయ్య, ఉప్పలయ్య, కుమార్‌, సతీష్‌, చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

vidyashaka mantrini tholiginchali, విద్యాశాఖ మంత్రిని తొలిగించాలి

విద్యాశాఖ మంత్రిని తొలిగించాలి

ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలలో తప్పులు దొర్లాయని పూర్తి బాధ్యతను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వహించాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని బిసి సంక్షేమ సంఘం యువజన విభాగ జాతీయ కార్యదర్శి కల్లూరి పవన్‌ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 5లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

prapancha maleria nirmulana dinnostvam, ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం

ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం

ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వైద్యులు డాక్టర్‌ నరేష్‌, డాక్టర్‌ రాహిల్‌ మాట్లాడుతూ నేడు కీటక జనిత వ్యాధుల నియంత్రణా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మలేరియా వ్యాధిని సమూలంగా నిర్మూలించడమే ప్రపంచంలోని దేశాల ధ్యేయమని పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే మలేరియా వ్యాధి వ్యాప్తిచెందకుండా చూసుకోవచ్చని తెలిపారు. ఇళ్లలో దోమ తెరలను వాడాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో వెంకటాపురం, ఎదిరా పిహెచ్‌సిల వైద్యులు, నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

collectorku vinathi, కలెక్టర్‌కు వినతి

కలెక్టర్‌కు వినతి

ములుగు కలెక్టర్‌ కార్యాలయం ముందు ఇంటర్‌ ఫలితాల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో అవకతవకాలపై నిరసన తెలిపి కలెక్టర్‌ సి.నారాయణరెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో జరిగిన అవకతవకలు, బోర్డ్‌ నిర్లక్ష్యం ఐటి కంపెనీ నిర్వాకం తదితర అంశాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని, విధ్యార్థులకు సంపూర్ణ న్యాయం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు మాజీ ఎంపీపీ నల్లెల్ల కుమారస్వామి, టౌన్‌ అధ్యక్షులు యూనిస్‌, బానోత్‌ రవిచందర్‌, తిరుపతిరెడ్డి, కంబాల రవి, జన్ను రవి, గండ్రకోట కుమార్‌, గోపాలరావు, సర్పంచ్‌ రత్నం, భద్రయ్య, గండ్రత్‌ విజయకార్‌, రవి, సజన్‌, రాంబాబు, నాజర్‌, ముంజల బిక్షపతి, వెంకటేష్‌, యుగేందర్‌, వెంకన్న, మధు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

railu kindapadi inter vidyarthi atmahatya, రైలు కిందపడి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

రైలు కిందపడి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నెక్కొండ మండలం మత్తడి తండాకు చెందిన బానోత్‌ నవీన్‌ అనే విద్యార్థి నెక్కొండ – ఇంటికన్నె రైల్వేస్టేషన్‌ మధ్యలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version