DCCB శాఖలో ఏటీఎం సేవలు ప్రారంభం…

DCCB శాఖలో ఏటీఎం సేవలు ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (DCCB) శాఖలో ఏటీఎం సేవలను శుక్రవారం ప్రారంభించారు. దాదాపు రెండేళ్లుగా ఏటీఎం సౌకర్యం లేక ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ ఏర్పాటు జరిగింది. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న ఈ ప్రాంతంలో రైతులు, వ్యాపారులు, ఖాతాదారులకు నగదు ఉపసంహరణ సులభతరం అవుతుంది. ఈ కార్యక్రమంలో సి.ఓ సురేష్, జీఎం శ్రీనివాస్, నోడల్ ఆఫీసర్ వెంకటేశం, బ్రాంచ్ మేనేజర్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version