ఇద్దరు గంజాయి తరలిస్తున్న నిందితుల అరెస్ట్

నిందితుల నుంచి 7.44 కే‌జి ల ఎండు గంజాయి, 2 సెల్ ఫోన్ లు స్వాధీనం

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పి పుల్లా కరుణాకర్ మాట్లాడుతూ
గురువారం రోజు సాయంత్రం సుమారు 04 గంటల ప్రాంతంలో జిల్లాలోని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేరు వేరు ప్రదేశాలలో 5 ఇన్ క్లైన్ మైన్ పరిధిలో జయశంకర్ పార్క్ దగ్గర గల భారత్ గ్యాస్ గోదాం వద్ద భూపాలపల్లి పోలీసు వారు ఇద్దరు వ్యక్తుల వద్ద మొతం గంజాయి పట్టుకున్నారు 7.44 కే‌జి ల ఎండు గంజాయి ని వారి వద్ద 2 సెల్ ఫోన్ లను స్వాదిన పరుచుకొనైనది . వారి పై Cr. No: 1) 458/2023 U/s 8(c),r/w 20(b) NDPS Act 2) 459/2023 U/s 8(c),r/w 20(b) NDPS Act ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది . అట్టి ఎండు గంజాయి కలిగిన వారి వివరాలు మొదటి వ్యక్తి .1)కంది సాయి చరణ్, తండ్రి: రవి వయసు 23 సంవత్సరాలు కులం: మాల వృత్తి :పెయింటింగ్, నివాసం :సుభాష్ కాలనీ భూపాలపల్లి రెండవ వ్యక్తి వివరాలు 2) మందల కళ్యాణ్ కుమార్ తండ్రి: హరికృష్ణ వయసు 22 కులం: ముదిరాజ్ వృత్తి: డ్రైవర్ నివాసం: భాస్కర్ గడ్డ భూపాలపల్లి. ఇట్టి ఎండు గంజాయిని వీరిద్దరు సుభాష్ కాలనీ భూపాల్పల్లి కి చెందిన 3) తోట పవన్ అనే వ్యక్తి వద్ద కొన్నట్లు విచారణలో తెలిసింది. కంది సాయి చరణ్ ను మందల కళ్యాణ్ కుమార్ లను జ్యుడీషియల్ రిమాండుకు తరలిస్తున్నామని ఎస్పి తెలిపారు. తోట పవన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని, ఇట్టి గంజాయి విలువ మార్కెట్లో మొత్తం దాదాపు 1,86,000/- రూపాయల వరకు ఉంటుందని జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్ గంజాయి నిర్మూలన లక్ష్యంగా గంజాయి పై రైడ్స్ చేయమని ఆదేశించగా అట్టి ఆదేశాల మేరకు భూపాలపల్లి డి‌ఎస్‌పి రాములు భూపాలపల్లి సిఐ రాంనర్సింహారెడ్డి ఎస్సైలు శ్రావణ్ కుమార్, సంధ్యారాణి, స్వప్నకుమారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది . గంజాయి, ఇతర డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని ప్రజలు, యువత పోలీసులకు తెలపాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version