ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా
పావుశెట్టి సునీల్ 7వ వార్డు అభ్యర్థి
పరకాల,నేటిధాత్రి
https://youtu.be/i0vGPu1YW4s?si=VEMl1XTexUQ7bDT4
పట్టణంలోని 7వ వార్డులో పావుశెట్టి సునీల్ విస్తృత ప్రచారం నినాదాలతో ఉత్సాహంగా సాగింది.ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు.తాగునీరు,డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానన్నారు.వార్డు అభివృద్ధికి సమిష్టిగా పని చేస్తామని తెలిపారు.
ప్రజల మద్దతే తన బలమని ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకం వ్యక్తం చేశారు.ప్రచారంలో నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
