కార్మికుడిని ఆదుకున్న బిల్డింగ్ రంగం ఏఐటియుసి…

కార్మికుడిని ఆదుకున్న బిల్డింగ్ రంగం ఏఐటియుసి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి పట్టణంలోని కొమురయ్య భవన్ ఏఐటీయూసీ ఆఫీస్ నందు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తుండగా ప్రమాదం జరిగిన కార్మికుడికి ఆర్థిక సహాయం 15000 అందించిన భవన నిర్మాణ కార్మిక సంఘం సహకారంతో ప్రమాదం జరిగిన కార్మికుడికి నగదు అందించిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బిల్డింగ్ రంగం నాయకులు
ఈ సందర్భంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకటేష్ మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణానికి చెందిన కార్ మాస్ కాలనీ నివాసం ఉంటున్న కన్నే వేణి సత్యం అనే కార్మికుడు గత 20 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఈ తరుణంలో గత నెల క్రితం భవన నిర్మాణం చేస్తుండగా కింద పడిపోయాడు అతనికి రెండు హరి రపాదాలలో గుత్తులు విరగగా నడవలేని స్థితికి చేరుకోవడం జరిగింది వారి కుటుంబ సభ్యులు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుల దృష్టికి తీసుకురాగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడిని ఆర్థిక సాయం కోరగా తలకొంత డబ్బులు జమ చేసుకొని యూనియన్ ఆఫీసులో భూపాలపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆ రెల్లి వినోద బిల్డింగ్ రంగం యూనియన్ ఆధ్వర్యంలో నగదు రూపేనా కన్నెవేని సత్యం భార్య కి 15 వేల నగదు రూపాయలు అందజేయడం జరిగిందన్నారు
తను నిరుపేద కుటుంబానికి చెందిన వాడైనందున కార్మికులు అతనికి జరిగిన సంఘటనకు చలించిపోయి కార్మికులు తోటి కార్మికుడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు బిల్డింగ్ కనెక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ తరఫున కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు
కార్మికులంతా కూడా కలిసికట్టుగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ తోటి సహచర కార్మికులందరికీ భరోసా ఇచ్చే విధంగా ఉండాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు
జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు లేబర్ కార్డు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే వారి కుటుంబాలకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని తక్షణము లేబర్ కార్డు లేని ప్రతి కార్మికుడు లేబర్ కార్డు చేసుకోవాలని దాని ద్వారా కార్మికుడికి చాలా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు చాలామంది కార్మికులు కార్డు పొందియుండి రెన్యువల్ చేసుకోకుండా నిర్లక్ష్యం చేయడం మూలంగా వివాహ కానుక ప్రస్తుత సౌకర్యం సహజ మరణం యాక్సిడెంట్లు డెత్ మెడికల్ క్లైమూల వంటి అనేక సంక్షేమ పథకాలను కోల్పోవాల్సి వస్తుందని కార్మికులకు తెలియజేశారు కార్మికులు పనిచేసే చోట సేఫ్టీ భద్రత ప్రమాణాలు పాటించి పనులు నిర్వహించాలని కోరారు. లేనిపక్షంలో కార్మికులకు అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కొనియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినోద గారికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు 11 రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతరాజు సతీష్ గంగ సారపు శ్రీనివాస్ గార్లకు కార్మిక వర్గం నాయకత్వం అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మేకల సమ్మయ్య చిలకని రాజయ్య తమ్మిశెట్టి సతీష్ మహమ్మదువలి సిద్ధం రాజు ఇంజాల శ్రీనివాస్ అనపర్తి సురేష్ మామిడిపల్లి చరణ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version