ఇరుముడితో విమాన ప్రయాణానికి అనుమతి

విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్పస్వాములకు గుడ్ న్యూస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

భారత పౌర విమానయాన శాఖ అయ్యప్ప భక్తులకు శుభవార్త అందించింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇరుముడితో నేరుగా విమానంలో ప్రయాణించడానికి అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం భక్తుల సాంప్రదాయాలు, ఆచారాలకు గౌరవం ఇస్తూనే భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ సాంస్కృతిక విలువలు, భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా ఈ నిర్ణయం నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version