నడికూడ,నేటి ధాత్రి:
మండలంలోని చర్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.యస్.లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ఒకసారి ఆలోచించాలి, తెలంగాణ రాక ముందు ఎలా ఉందో,ఇప్పుడు ఎలా అభివృద్ధి జరిగిందో గమనించాలన్నారు.యువత రేపటి భవిష్యత్ కి మూలాదారమని, యువత కాంగ్రెస్,బిజెపి పార్టీల ప్రలోబాలకు లోంగకూడదని కోరారు.
పార్టీ లో చేరిన వారిలో గుడికందుల స్వామి,నదికొండ రాజు,ఎండి జాకీర్ పున్నం, సాయి చరణ్, బసువారి రాజు,ఎదులాపురం వెంకటరమణ చారి,వీర ప్రతాప్,బసువారి రవి, రాజేంద్రప్రసాద్,మధువాన్, కూసుంబ హరీష్, జక్కుల రాజ్ కుమార్,హరీష్,గుమ్మడి రంజిత్ కుమార్,బూర రాజు,అప్పుల వంశీ.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.