నా ఇల్లు కూలగొట్టిన వారిపై చర్య తీసుకోవాలి..

నా ఇల్లు కూలగొట్టిన వారిపై చర్య తీసుకోవాలి

పొట్టి పోషం ఎస్సీ మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

 

కాటారం గారెపల్లి పోతులవాయి గ్రామ శివారులోని సర్వే, చెం. 254/2 లో 0.22 పంట భూమి పట్టా కబ్జాకు కలదు. భూమి లావాణి పట్టా ఈ భూమిని పొట్టి పోషము, భర్త, పోచయ్య, వయస్సు, 55 సం॥లు, కులం, ఎస్.సి (మాదిగ), ఆర్/ఓ 25 సం॥లుగా వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాను. నాకు ఈ భూమిపైన హైకోర్టు ఆర్డర్ ఉన్నది. ఈ భూమిలో నేను సంవత్సరము క్రింద నాలుగు రూముల ఇల్లును కూడా నిర్మించుకున్నాను. నేను దసరా పండుగకు ఊరికి పోయిన సమయంలో తేది. 10,10, 2024 రోజున అర్ధరాత్రి సుమారు 12గం॥ల ప్రాంతంలో 1) వంగల సుదర్శన్, తండ్రి. నర్సయ్య,ఆర్/ఓ మహదేవ్ పూర్, 2) ఓదెల సదయ్య, ఆర్/ఓ కాటారం, కులం.బి.సి అగ్రకులం వారు మరికొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు నా ఇంటి పైన ఉన్న సిమెంట్ రేకులను ముక్కలు ముక్కలుగా పగులగొట్టి నేలమట్టం చేసినారు. నా ఇంటి లోని కరెంటు మీటర్ను పగలగొట్టినారు. గోడలకు ఉన్న కరెంటు బోర్డులు పగులగొట్టినారు. నాకు 50వేలు ఆర్ధిక నష్టం చేసినారు. జనగాం శంకరయ్య అను అతని ఇంటిపై నుండి నేను కరెంటు వైరు తీసుకున్నందుకు వంగల సుదర్శన్ అను అతను ఆయన నన్ను కరెంటు వైరు ఎందుకు పోనిచ్చినారని భూతులు తిడుతూ బయబ్రాంతులకు గురిచేసి మరుసటిరోజు ఇంటి పైన రేకులను కూలగొట్టినారు. వారితో నాకు ప్రాణభయం ఉన్నది. ఇట్టి విషయం పై కాటారం పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేయగా నాయొక్క పిటీషన్ తీసుకోలేదు. కావున జిల్లా కలెక్టర్ ఎస్పీ స్పందించి నాకు న్యాయం చేయగలరు పొట్టి పోశయ్య విజ్ఞప్తి చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version