ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ రాజకుమార్.
చిట్యాల, నేటిధాత్రి :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వేల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో చిట్యాల మండలంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు విద్యారంగ సంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది ,ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల విద్యారంగం పట్ల మొండి వైఖరి చూపిస్తుందని వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఎంఈఓ డీఈవో పోస్టులను భర్తీ చేయాలని సరైన సమయంలో పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులను అందజేయాలని డిమాండ్ చేశారు ,ఈ కార్యక్రమంలో రాకేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.