ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రామడుగు, నేటిధాత్రి:
ఇరవై తోమ్మిది సం.ల క్రితం పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఒకే వేదికపై కలిసి చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96లో ఎస్ఎస్సి చదివిన విద్యార్థులు చదువుకున్న పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అప్పటి ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, ఒకేషనల్ ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, రాంబ్రహ్మంలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన విద్యార్థులు వారిని ఘనంగా శాలువాతో సన్మానించి వారి నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు తమ జీవనశైలిని, పాఠశాలలో చదువుకున్న జ్ఞాపకాలను, అనుభవాలను ఒక్కొక్కటిగా గురువుల ముందుంచారు. ఈకార్యక్రమంలో బొమ్మరవేణి తిరుపతి, ఆడెపు మనోజ్ కుమార్, శ్రీనివాస్, సంతోష్, మునిందర్, శ్వేతా, సుజాత, పద్మ, తదితరులు పాల్గొన్నారు.